కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత, వైద్యుల చికిత్స: ప్రధాని మోడీ ఫోన్ చేసి ఆరా
కోల్కతా: కేంద్ర రవాణా, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతస్థ కు గురయ్యారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో ఓ కార్యక్రమానికి హాజరైనఆయన.. స్టేజీస్టే పై ఉండగానే కాస్త అసౌకర్యా నికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైత్త న అధికారులు.. వైద్యుడిని
ఆగమేఘాల మీద సభావేదిక ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చారు.
గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి మరీ.. వైద్యుడిని తరలించారు. సిలిగురిలోని సేవక్ కంటోన్మెం ట్ పరిధిలో.. ఫోర్ లైన్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వచ్చారు. వేదికపై ఉన్న గడ్కరీ.. కాసేపటికే కాస్త అసౌకర్యా నికి గురయ్యారు. దీంతో కార్యక్రమాన్ని వెంటనే
నిలిపివేశారు.
ఓ గదిలో విశ్రాంతి తీసుకునేం దుకు వెళ్లినళ్లి కేంద్రమంత్రికి మరింత అసౌకర్యంగా అనిపించింది. వెంటనే వైద్యుడిని పిలిపించారు. కేంద్ర మంత్రిని పరీక్షించిన డాక్టర్లు.. ఆయనకు ప్రాథమిక పరీక్షలు చేశారు. రక్తంలో చక్కెర స్థాయులు పడిపోయినట్లు వైద్యుడు గుర్తిం చారు.

అనంతరం, సెలైన్ ఎక్కిం చారు. చికిత్స తర్వా త నితిన్ గడ్కరీని డార్జీలింర్జీ గ్ ఎంపీ రాజు బిస్తా తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలుసుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు. గడ్కరీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
మరోవైపు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా నితిన్ గడ్కరీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితిని పర్యవేక్షించాలని పోలీస్ కమిషనర్ కు ఆమె ఆదేశించారు.












Click it and Unblock the Notifications