జూన్ వరకు రద్దుచేసిన నగదును మార్చుకోవచ్చు
ఎన్ ఆర్ ఐలు పెద్ద నగదు నోట్లను మార్పిడి చేసుకొనేందుకుగాను ఈ ఏడాది జూన్ నాటికి అవకాశం కల్పించింది కేంద్రం.
న్యూఢిల్లీ :రద్దుచేసిన నగదు నోట్లను మార్చుకొనేందుకు ఈ ఏడాది జూన్ 30వ, తేది వరకు ఎన్ ఆర్ ఐలకు కేంద్రం అనుమతినిచ్చింది.అయితే జూన్ తర్వాత ఈ నగదును మార్చుకొనే అవకాశం లేదని కేంద్రం తేల్చేసింది.
గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను కేంద్రం రద్దుచేసింది. పెద్ద నగదును రద్దుచేసిన తర్వాత వీటిని మార్చుకొనేందుకుగాను గత ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు గడువు విధించింది. ఈ గడువు పూర్తైంది. రద్దుచేసిన నగదును కలిగివున్నవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

అయితే రద్దుచేసిన నగదును కలిగి ఉన్న ఎన్ ఆర్ ఐ లకు మాత్రం కేంద్రం మరో అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ వరకు ఎన్ ఆర్ ఐ లకు అవకాశాన్ని కల్పించింది.
అయితే ఎంత నగదు ఉన్నా ఎన్ ఆర్ ఐలు తమ నగదును మార్చుకొనే వెసులుబాటును కల్పించింది కేంద్రం.ఎన్ ఆర్ ఐ లకు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద ఒక్కొక్కరు 25 వేల రూపాయాల పరిమితి ఉంటుందన్నారు.
గుర్తింపు పత్రాలతో పాటు నిర్ణీత కాలవ్యవధిలో విదేశాల్లో ఉన్నట్టు, గతంలో నోట్లు మార్చుకోలేదని ఆధారాలను చూపాలని ఆర్ బి ఐ తేల్చి చెప్పింది. మార్పిడిలో మూడో పక్షాన్ని అనుమతించబోమన్నారు. ఈ నిబంధనలను పూర్తిచేస్తే బ్యాంకు ఖాతాలో మార్పిడి నగదు జమ అవుతోందని ఆర్ బి ఐ ప్రకటించింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications