జూన్ వరకు రద్దుచేసిన నగదును మార్చుకోవచ్చు
ఎన్ ఆర్ ఐలు పెద్ద నగదు నోట్లను మార్పిడి చేసుకొనేందుకుగాను ఈ ఏడాది జూన్ నాటికి అవకాశం కల్పించింది కేంద్రం.
న్యూఢిల్లీ :రద్దుచేసిన నగదు నోట్లను మార్చుకొనేందుకు ఈ ఏడాది జూన్ 30వ, తేది వరకు ఎన్ ఆర్ ఐలకు కేంద్రం అనుమతినిచ్చింది.అయితే జూన్ తర్వాత ఈ నగదును మార్చుకొనే అవకాశం లేదని కేంద్రం తేల్చేసింది.
గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను కేంద్రం రద్దుచేసింది. పెద్ద నగదును రద్దుచేసిన తర్వాత వీటిని మార్చుకొనేందుకుగాను గత ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు గడువు విధించింది. ఈ గడువు పూర్తైంది. రద్దుచేసిన నగదును కలిగివున్నవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
అయితే రద్దుచేసిన నగదును కలిగి ఉన్న ఎన్ ఆర్ ఐ లకు మాత్రం కేంద్రం మరో అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ వరకు ఎన్ ఆర్ ఐ లకు అవకాశాన్ని కల్పించింది.
అయితే ఎంత నగదు ఉన్నా ఎన్ ఆర్ ఐలు తమ నగదును మార్చుకొనే వెసులుబాటును కల్పించింది కేంద్రం.ఎన్ ఆర్ ఐ లకు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద ఒక్కొక్కరు 25 వేల రూపాయాల పరిమితి ఉంటుందన్నారు.
గుర్తింపు పత్రాలతో పాటు నిర్ణీత కాలవ్యవధిలో విదేశాల్లో ఉన్నట్టు, గతంలో నోట్లు మార్చుకోలేదని ఆధారాలను చూపాలని ఆర్ బి ఐ తేల్చి చెప్పింది. మార్పిడిలో మూడో పక్షాన్ని అనుమతించబోమన్నారు. ఈ నిబంధనలను పూర్తిచేస్తే బ్యాంకు ఖాతాలో మార్పిడి నగదు జమ అవుతోందని ఆర్ బి ఐ ప్రకటించింది.