ప్రధాని మోడీకి వ్యతిరేకంగా బెంగళూరులో పకోడ ప్రతిఘటన: చివరికి మాకు ఇదే గతి!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్ ఎస్ యూఐ విద్యార్థి సంఘం సభ్యులు బెంగళూరులోని ఆర్ సీ కాలేజ్ ముందు భాగంలో మంగళవారం పకోడ ప్రతిఘటన నిర్వహించారు.. పకోడ విక్రయించిన ఎన్ఎస్ యూఐ విద్యార్థి విభాగం నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ తీరును ఎండగట్టారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ తాను ప్రధాని అయిన తరువాత భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయని చెప్పారు. నిరుద్యోగులు సైతం ఖాళీగా ఉండకుండా రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టుకుని పకోడాలు వేసుకుని రోజుకు రూ. 200 నుంచి రూ. 300 సంపాధిస్తున్నారని మోడీ అన్నారు.
రోడ్డు పక్కన పకోడాలు వేసుకుని అమ్ముకుంటే అది మీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగామా ? అంటూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. మోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉంటే మాలాంటి విధ్యావంతులకు ఉద్యోగాలు రావలని, చివరికి పకోడాలు వేసుకుని అమ్ముకోవాల్సిందే అంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.