సరి-బేసిపై ఇలా: ఏం చేయను.. గీత దాటి చేతులెత్తేశాడు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సరి-బేసి విధానం ఈ రోజు విజయవంతంగా అమలు కావడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఈ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించారన్నారు. రానున్న ఐదేళ్లలో ఢిల్లీ ప్రజలు దేశానికి మంచి మార్గం చూపుతారన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన సరి-బేసి ట్రాఫిక్ ఫార్ములాపై బిజెపి నేత, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందించారు. ఈ ట్రాఫిక్ ఫార్ములా మంచి ఫలితాలనివ్వనుందన్నారు. సరికొత్త ఫార్ములా అయినా జనం బాగా స్పందిస్తున్నారన్నారు. అయితే, ఈ అంశాన్ని రాజకీయం చేయడాన్ని మాత్రం ఆయన తప్పుబట్టారు.
కాగా, సరి - బేసి విధానం ప్రవేశ పెట్టిన తొలి రోజు అరగంట తర్వాత ఓ వ్యక్తి ఆ గీతను దాటాడు. దీనిని ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభిచారు. ఐటీవో జంక్షన్ వద్ద 33 నిమిషాల తర్వాత ఓ వ్యక్తి గీత దాటారు. అతనికి పోలీసులు రూ.2వేల జరిమానా విధించారు.
On day 1 at least Dilliwallahs seem to be keen on making #OddEvenPlan succeed. Public will is key to success. pic.twitter.com/91GGSh4PG3
— Rahul Kanwal (@rahulkanwal) January 1, 2016 ఈ సందర్భంగా పోలీసులతో అతను మాట్లాడుతూ... తనకు మరో అవకాశం లేకపోవడం వల్లనే ఇలా జరిగిందన్నారు. పారీచౌక్లోని తన నివాసం నుంచి సరైన రవాణా సౌకర్యాలు లేవని చెప్పారు. తనకు నిబంధన తెలుసునని, కానీ మరో అవకాశం లేదన్నారు.
Tho odd even number formula likely to cause inconvenience to people of Delhi, I still wish it succeeds.Delhi air requires emergency measures
— Madhu Kishwar (@madhukishwar) January 1, 2016 First day, first show: looks like @ArvindKejriwal odd even scheme could be a winner! Key test on Monday the 4th!
— Rajdeep Sardesai (@sardesairajdeep) January 1, 2016 ఈ రోజు బేసీ సంఖ్యలు ఉన్న వాహనాలు మాత్రమే బయటకు రావాలి. కానీ ఉదయం గం.8.33 నిమిషాలకు ఐటీవో జంక్షన్ వద్ద సరి సంఖ్య ఉన్న కారులో అతను వచ్చాడు. దీంతో అతనికి పోలీసులు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ మాట్లాడుతూ... ప్రజలు తనకు సహకరించాలన్నారు.

సరి బేసి విధానం
ప్రభుత్వం సరి-బేసి విధానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఢిల్లీ ఎన్విరన్మెంటల్ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఈ- రిక్షా ద్వారా సచివాలయానికి వెళ్తున్న దృశ్యం.

సరి బేసి విధానం
ప్రభుత్వం సరి-బేసి విధానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ద్విచక్ర వాహనంపైన సచివాలయానికి వెళ్తున్న దృశ్యం.

సరి బేసి విధానం
ప్రభుత్వం సరి-బేసి విధానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో.. అరగంట తర్వాత సరి సంఖ్య నెంబర్ కారు కనిపించగా చలాన రాస్తున్న పోలీసులు.

సరి బేసి విధానం
ప్రభుత్వం సరి-బేసి విధానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో అరగంట తర్వాత సరి సంఖ్య నెంబరు గల కారులో ప్రయాణించిన వ్యక్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి మరోసారి ఇలా రావొద్దని పోలీసులు చెబుతున్న దృశ్యం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications