Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒమిక్రాన్ భయం; ఢిల్లీలో అన్ని కోవిడ్ శాంపిల్స్‌ జీనోమ్ సీక్వెన్సింగ్; బూస్టర్ డోసులపై సీఎం కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఒమిక్రాన్ కేసుల ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ కొత్త వేరియంట్ అయిన ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున, కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించిన అన్ని నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలను నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తెలిపారు.

కరోనా నిర్ధారణ అయిన వారందరి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్ : ఢిల్లీ సీఎం

కరోనా నిర్ధారణ అయిన వారందరి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్ : ఢిల్లీ సీఎం


ప్రస్తుతానికి, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాలను మాత్రమే పంపుతున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. అంతేకాదు పూర్తిగా టీకాలు వేసిన వారికి బూస్టర్ డోసులు వేసేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి అనుమతినివ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని అభ్యర్థించారు. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 99 శాతం మంది ప్రజలు మొదటి డోస్‌తో మరియు 70 శాతం మందికి రెండవ డోస్‌తో టీకాలు వేశామని ఆయన పేర్కొన్నారు. నగరంలో బూస్టర్ డోస్ డ్రైవ్ ప్రారంభించడానికి మాకు అన్ని సౌకర్యాలు మరియు ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే, ప్రభుత్వం డ్రైవ్‌ను ప్రారంభించి, మొదట ఆరోగ్య కార్యకర్తలందరికీ, తరువాత ఇతరులకు బూస్టర్ షాట్‌లను ఇస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

ఒమిక్రాన్ తో పోరాటానికి ఆస్పత్రులను సిద్ధం చేశాం .. ఆందోళన వద్దు

ఒమిక్రాన్ తో పోరాటానికి ఆస్పత్రులను సిద్ధం చేశాం .. ఆందోళన వద్దు


ప్రజలు భయాందోళన చెందవద్దని సిఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులతో పాటు కోవిడ్ మూడవ వేవ్‌పై పోరాడటానికి ఆసుపత్రులలో అన్ని ఏర్పాట్లను చేసిందని, పడకలు, మందులు మరియు ఆక్సిజన్‌తో అన్నింటికీ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని మరియు తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటుందని నిపుణులు విశ్వసిస్తున్నారని ఆయన తెలిపారు. తాము నిపుణులతో వేరియంట్ వల్ల కలిగే ప్రభావాన్ని మరియు సమస్యలను అంచనా వేశామని స్పష్టం చేశారు.

హోం ఐసోలేషన్ బలోపేతం .. డిసెంబర్ 23న సమీక్ష సమావేశం

హోం ఐసోలేషన్ బలోపేతం .. డిసెంబర్ 23న సమీక్ష సమావేశం

ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు మాకు తెలియజేశారని, అయితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుందని, తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉంటాయని చెప్పారని, మరణించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయన్నారు అరవింద్ కేజ్రీవాల్. కోవిడ్-19తో పోరాడేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. వైరస్‌తో మరింత పోరాడేందుకు, రోగులకు ఇంట్లోనే చికిత్స చేసేందుకు హోమ్ ఐసోలేషన్ ప్రోగ్రామ్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని డిడిఎమ్ ఏ నిర్ణయించిందని తెలిపారు. దీనిపై డిసెంబర్ 23న సమీక్ష సమావేశం కూడా నిర్వహించనున్నామని వెల్లడించారు. నిపుణులతో చర్చించిన తర్వాత, ఈసారి, హోమ్ ఐసోలేషన్ పెద్దగా అవసరమని మేము నిర్ణయానికి వచ్చామని, హోమ్ ఐసోలేషన్ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచాలని నిర్ణయించామని కేజ్రీవాల్ అన్నారు.

కోవిడ్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి

కోవిడ్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి

కోవిడ్ ప్రోటోకాల్‌లను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం లేదని గమనించబడిందని, దయచేసి బహిరంగ ప్రదేశాల్లో తమ మాస్క్‌లను అన్ని వేళలా ధరించాల్సిందిగా చేతులెత్తి ఢిల్లీ వాసులు అందరికీ తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు . మన భద్రత మన చేతుల్లోనే ఉందని కోవిడ్‌కు మాస్క్‌లు ఉత్తమ రక్షణ అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని కేజ్రివాల్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో 30,000 కోవిడ్ పడకలు సిద్ధం చేసిందని, ఒక్కో వార్డుకు 100 పడకలు అవసరమైనప్పుడు ఢిల్లీ మొత్తం పడకల సామర్థ్యాన్ని 64,000కు పైగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదనంగా, 6,800 ఐసియులు కూడా అతి త్వరలో సిద్ధంగా ఉంటాయని, అవసరమైన మందులను కూడా సిద్ధం చేశామని వెల్లడించారు.

Recommended Video

    Omicron: After Omicron Another Mysterious Disease In Africa
    కరోనా నియంత్రణ కోసం అన్ని రకాల వైద్య వసతుల కల్పన

    కరోనా నియంత్రణ కోసం అన్ని రకాల వైద్య వసతుల కల్పన

    కోవిడ్ నిర్వహణ కోసం సిబ్బందిని పెంచడంపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోందని తద్వారా ఇన్‌ఫెక్షన్ రేటు పెరిగితే, వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్ సిబ్బంది కొరత ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం స్పెషలిస్ట్ డాక్టర్లతో పాటు వైద్య విద్యార్థులు, నర్సులు మరియు పారామెడికల్ సిబ్బందికి కోవిడ్ నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిందని తెలిపారు. కోవిడ్ నిర్వహణ కోసం సుమారు 5,000 మంది ఆరోగ్య సహాయకులను నియమించామని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

     ఢిల్లీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు .. దేశంలో మొత్తం 168కేసులు

    ఢిల్లీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు .. దేశంలో మొత్తం 168కేసులు


    ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆరు, కర్నాటకలో ఐదు, మరియు కేరళలో కొత్త కరోనావైరస్ వేరియంట్‌లో మరో నాలుగు కేసులు నమోదవడంతో భారతదేశంలోని ఓమిక్రాన్ కేసుల సంఖ్య సోమవారం 168కి పెరిగింది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల మధ్య, 'ప్రమాదంలో ఉన్న' దేశాల నుండి వచ్చే రోగుల కోసం ఐసోలేషన్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం మూడు ప్రైవేట్ ఆసుపత్రులను ఆదేశించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తగిన చర్యలు కోసం కేంద్రం దృష్టికి తీసుకు వెళుతుంది.

    ఒమిక్రాన్ వేరియంట్ పై ఆందోళన ... అనుమానాలు

    ఒమిక్రాన్ వేరియంట్ పై ఆందోళన ... అనుమానాలు


    ఒమిక్రాన్ వేరియంట్ పై ఆందోళనల మధ్య, భారతదేశం యొక్క కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మన టీకాలు కరోనా కొత్త వేరియంట్లు ఉద్భవిస్తున్న పరిస్థితులలో అసమర్థంగా మారవచ్చు అని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి వ్యాక్సిన్‌లను సవరించడానికి సిద్ధంగా ఉండవలసిన అవసరాన్ని వి కె పాల్ నొక్కిచెప్పారు. ఒమిక్రాన్ ఇచ్చే షాక్ ను ఎదుర్కోబోతున్నామని, ఎమర్జెన్సీ వస్తే వ్యాక్సిన్లు ఆపలేవని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+