మోడీ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చిన దీదీ ! బెంగాల్ నుంచి స్వీట్లు తప్ప ఓట్లు రావు ...
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పీఎం మోడి గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్షయ్ కుమార్ తో ఇంటర్యూలో భాగంగా మోడి కొన్ని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఇలాంటీవి చెప్పకూడని సమయం అంటూనే ప్రతి సంవత్సరం దీదీ తనకు రెండు జతల కుర్తాలు పంపిస్తుందని ,వీటితో పాటు రసగుల్లలు కూడ పంపిస్తుందని చెప్పారు. అయితే ఇవి రాజకీయంగా రెండు పార్టీల మధ్య అంతర్గత అవగహాన ఉన్నాయనే ఆరోపణలు దీదీ ఎదుర్కోంటుంది. ఈ నేపథ్యంలో వీటిని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేసింది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
స్వీట్లు, గిఫ్ట్ ఇవ్వడం మా సాంప్రదాయం ,దిదీ
కాగా బెంగాల్ ఎన్నికల సభలో పాల్గోన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోది వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిచారు. మేము అతిథులను రసగుల్ల లతో స్వాగతిస్తం కాని ఒక్క ఓటు కూడ ఇవ్వం అని ప్రధాని పేరు వాడకుండా కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ సంప్రాదాయం ప్రకారం ప్రత్యేక సంధర్భాల్లో అతిధులను గౌరవిస్తామని చెప్పింది. అంతమాత్రాన తాము బీజేపికి సపోర్ట్ చేయమని చెప్పింది దిదీ.
దీదీ నాకు ప్రతి సంవత్సరం కుర్తాలు స్వీట్స్ పంపిస్తుంది.
కాగా అక్షయ్ కుమార్ తో ఇంటర్యులో బాగాంగా ప్రధాని మోది , ఈ విషయాన్ని చెబితే ప్రజలు ఆశ్యపడతారని, దిదీ ప్రతి సంవత్సరం బహుమతులు ఇస్తుందని ,ఇప్పటికి కూడ ఒకటి లేదా రెండు కుర్తాలు ప్రతి సంవత్సరం పంపుతుందని చెప్పారు. కాగా బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా సైతం ప్రతి సంవత్సరం వెరైటీ స్వీట్స్ పంపిస్తుందని అడిగిన అక్షయ్ ప్రశ్నకు బదులుగా, అది తెలుసుకున్న మమత కూడ ప్రతి సంవత్సరంలో రెండు లేదా మూడుసార్లు స్వీట్స్ పంపిస్తోందని మోడీ నవ్యుతూ చెప్పారు.
దిదీ, మోదీ పై రాజకీయ విమర్శలు
రెండు పార్టీల నడుమ రాజకీయ విమర్శలు చెసుకుంటున్న వాటి మధ్య అంతర్గత ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ విమర్షిస్తోంది. మోది ఇంటర్యు నేపథ్యంలో రెండు పార్టీల మధ్య స్నేహ పూర్వక ఓప్పందం బయటపడిందని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమన్ మిత్ర అన్నారు. కాగా ఏడు విడతల్లో కొనసాగనున్న పోలీంగ్ మే 19 న ముగియనుంది.