Operation Kaveri : సూడాన్ నుంచి భారతీయుల తరలింపుకు "ఆపరేషన్ కావేరీ" మొదలు
సూడాన్ లో మొదలైన అంతర్యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. దీంతో పాటే సూడాన్ లోని భారతీయుల ప్రాణాలకు ముప్పు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న మన పౌరుల్ని సురక్షితంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన భారత్.. ఇప్పుడు వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ కావేరీ పేరుతో ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది.
ఆపరేషన్ కావేరీలో భాగంగా ఇవాళ్టి నుంచి భారతీయుల్ని స్వదేశానికి తరలించబోతున్నారు. ఇందుకోసం వారిని సూడాన్ పోర్టుకు రావాలని సూచించారు. ఈ మేరకు 500 మంది భారతీయులు సూడాన్ పోర్టుకు చేరుకున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. యుద్ధంతో అతలాకుతలమైన సూడాన్ నుండి తమ పౌరులను తరలించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోందని, దాదాపు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్ చేరుకున్నారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు.

సూడాన్లో చిక్కుకుపోయిన మన పౌరులను తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ కావేరీ జరుగుతోందని, సుమారు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్కు చేరుకున్నారని జైశంకర్ ట్వీట్ లో తెలిపారు. మరికొంతమంది వారి బాటలోనే ఉన్నారన్నారు. మన నౌకలు, విమానాలు వారిని స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. సూడాన్లోని మన సోదరులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని జై శంకర్ ట్వీట్ చేశారు.
Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 24, 2023
About 500 Indians have reached Port Sudan. More on their way.
Our ships and aircraft are set to bring them back home.
Committed to assist all our bretheren in Sudan. pic.twitter.com/8EOoDfhlbZ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130J జెడ్డాలో సిద్ధంగా ఉంచిందని, ఐఎన్ఎస్ సుమేధ భారతీయులను తరలించడానికి పోర్ట్ సుడాన్కు చేరుకుందని నిన్న కేంద్రం ప్రకటించింది. వివిధ దేశాల నుండి 150 మందికి పైగా ప్రజలు శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. దీంతో పౌరుల తరలింపును వారు ముందుగా ప్రారంభించారు. సౌదీలు కాకుండా భారతదేశంతో సహా 12 ఇతర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నారు. సౌదీ అరేబియా తరలించిన ముగ్గురు భారతీయులు సౌదీ అరేబియా ఎయిర్లైన్లోని సిబ్బందిగా తేలింది. గత వారం భూమార్గంలో పోరాటం ప్రారంభమైనప్పుడు కాల్పులు జరిగాయి. ఈరోజు తెల్లవారుజామున భారతీయ పౌరులతో సహా 28 దేశాల నుండి 388 మందిని ఫ్రాన్స్ తరలించింది.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications