కశ్మీర్ విభజనను వ్యతిరేకించిన నటుడు కమలహాసన్
జమ్ము కశ్మీర్ విభజనను నటుడు కమలహాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు విభజన చేయడాన్ని తప్పుబట్టిన కమలాహసన్ ఈ చర్య ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇది నిరంకుశ చర్య పేర్కోన్నారు. ప్రతిపక్షాల కనీస అభిప్రాయాలను తీసుకోకుండా పార్లమెంట్లో నిరంకుశగా వ్యవహరించారని అన్నాడు. కనీసం బిల్లుపై చర్చించే సమయం కూడ ఇవ్వలేదని మండిపడ్డాడు.
జమ్ము కశ్మీర్ పునర్విభజన పై కేంద్రం చేపట్టిన వైఖరిపై ఎమ్ఎన్ఎమ్ నేత నటుడు కమలహాసన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంనే కేంద్రం తీసుకున్న చర్యపై మండిపడ్డారు. ముఖ్యంగా కేంద్రం వ్వవహరించిన తీరును తప్పు బట్టిన ఆయన ప్రజాస్వామ్యం తిరిగమనదిశగా పయనిస్తుందని పేర్కోన్నారు.

కాగా ఒకే రోజుల్లో అనూహ్య నిర్ణయాలను కశ్మీర్ పునర్విజన బిల్లును తీసుకుచ్చంది. ఊహించని విధంగా రాజ్యసభలో పరిణామాలు చేసుకున్నాయి. ఉదయం పదకొండు గంటకు విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ వేంటనే ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేస్తూ ఏకంగా రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ముఖ్యంగా ఈ చర్యను కాంగ్రెస్ పార్టీతో పాటు పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్తో డీఎంకే, తోపాటు పీడీపీ ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనేపథ్యంలోనే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా దేశానికి ఉన్న తలను నరికి ముక్కలు ముక్కలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ గులాంనబి అజాద్ వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వానికి చాల పార్టీలు మద్దతుగా నిలవడంతో రాజ్యసభలో బిల్లు పూర్తి మెజారిటితో నెగ్గింది.












Click it and Unblock the Notifications