రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ, చేతిలో రెడ్ ఫైల్!
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో పాకిస్థాన్ దేశంపై భారత్ పలు ఆంక్షలకు సిద్ధమైంది. పాకిస్థాన్తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేసింది. భారతదేశంలో ఉన్న పాకిస్థానీయులు 48 గంటల్లోకా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. వాఘా బోర్డర్ను మూసివేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా భారత్ పట్ల ఇలాంటి చర్యలకు దిగింది. భారత విమానాలను తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉద్రిక్తలను మరింతగా పెంచుతున్నాయి.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను ఆమెకు వివరించినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను రాష్ట్రపతి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
కాగా, ఈ సమావేశానికి వెళ్లిన ఇద్దరు మంత్రులు సర్వ సైన్యాధిపతి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు రెడ్ ఫైల్ ఉంచారు. ఇప్పుడు ఈ రెడ్ ఫైల్ హాట్ టాపిక్గా మారింది. ఇందులో ఏముందనేది ఆసక్తిగా మారింది. పాకిస్థాన్పై ఏదైనా సైనిక చర్య ఉంటుందా? మరేదైనా సంచలన నిర్ణయం ఉంటుందా? అనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ.. చైనా, కెనడాతో సహా జీ20 దేశాల ఎంపిక చేసిన రాయబారులతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీ దాదాపు 30 నిమిషాలపాటు కొనసాగినట్లు తెలిసింది. పహల్గాం దాడిలో పాకిస్థాన్ ప్రమేయం గురించిన ఆధారాలను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ జర్మనీ, జపాన్, పోలాండ్, యుకే, రష్యా సహా 20 దేశాల రాయబారుల ముందుంచింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications