Seema Haider rakhi to Yogi : యోగీకి రాఖీ పంపిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్...
ఈ ఏడాది మేలో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి ఇబ్బందులకు గురైన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ ఇప్పుడు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ కు రాఖీలు పంపింది. ఏడేళ్ల లోపు వయసున్న తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా వీసా లేకుండా అక్రమంగా భారత్లోకి ప్రవేశించినందుకు సీమాను జూలై 4న అరెస్టు చేయగా.. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్ అనే వ్యక్తినీ జైలుకు పంపారు.
పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్కు చెందిన సీమా హైదర్... 2019-20లో ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతున్నప్పుడు మీనాతో పరిచయం ఏర్పడిందని.. చివరికి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ముందు వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా మాట్లాడుకున్నారని తేలింది. నేపాల్లోని ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం హిందూ మతంలోకి మారానని, మీనాను వివాహం చేసుకున్నానని పాకిస్తాన్ మహిళ సీమా పేర్కొన్నారు.

హైదర్ తన నలుగురు పిల్లలతో సహా గ్రేటర్ నోయిడాలోని తన అత్తింట్లో ఉండటానికి అనుమతించాలని అభ్యర్థిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి క్షమాభిక్ష పిటిషన్ను కూడా దాఖలు చేసింది. హైదర్ తన కేసులో రాష్ట్రపతి నుండి మౌఖిక విచారణకు కూడా కోరారు.ఈ వ్యవహారంలో ఆమెకు మద్దతుగా నిలిచిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు ఆమె రాఖీ పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు రాఖీలు పంపి ఆమె సాయం కోరారు.
Seema Haider has sent Rakhi to PM Modi , Amit Shah, Yogi and Sangh chief #SeemaHaider pic.twitter.com/rkJo8GUERJ
— Smriti Sharma (@SmritiSharma_) August 22, 2023
అలాగే సీమా హైదర్ ఓ వీడియో సందేశం కూడా విడుదల చేసింది. ఇందులో సీమా హైదర్.. ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు యోగీ, ఇతర నేతల్ని రాఖీ పండుగ సందర్భంగా తాను పంపిన రాఖీలు కట్టుకోవాలని కోరారు. ప్రస్తుతం తన భాగస్వామి సచిన్ మీనాతో కలిసి నోయిడాలో నివసిస్తున్న సీమా.. రాఖీ పండుగ సెంటిమెంట్ తో రాజకీయ నేతల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications