సభను నిరవధిక వాయిదా వేస్తా: స్పీకర్ హెచ్చరిక, రాజీనామాలతో వైసీపీ రెడీ
Recommended Video

సీఎం రమేష్ రాజీనామా ? మోడీ ఫేర్వెల్ స్పీచ్
న్యూఢిల్లీ: లోకసభలో బుధవారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే కావేరీ బోర్డును ఏర్పాటు అన్నాడీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనలు నిర్వహించారు.
సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు వినలేదు. సభ్యులు ఆందోళన విరమించకుంటే నిరవధిక వాయిదా వేస్తానని స్పీకర్ హెచ్చరించారు. అయినా సభ్యుల ఆందోళన తగ్గలేదు. దీంతో సభను గంటపాటు వాయిదా వేశారు. మరోవైపు, రాజ్యసభ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, సభ ఎప్పుడైనా నిరవధిక వాయిదాపడే అవకాశాలున్నాయి. అవిశ్వాసంపై చర్చించకుండా సభను నిరవధిక వాయిదా వేస్తే రాజీనామాలు చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. ఇందుకోసం స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సిద్ధం చేసుకుంది.












Click it and Unblock the Notifications