క్లైమాక్స్కు అవిశ్వాసం: ఆయుధాలతో టీడీపీ సిద్ధం, బాబు టార్గెట్గా మాట్లాడనున్న మోడీ!
అమరావతి: అవిశ్వాస తీర్మానం అంశం క్లైమాక్స్కు చేరింది. టీడీపీ, వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే సీపీఎం, కాంగ్రెస్, ఆర్ఎస్పీలు తోడయ్యాయి. మరోవైపు బీజేపీ కూడా అవిశ్వాసానికి సిద్ధమని చెబుతోంది. దీంతో అవిశ్వాసం నోటీసు అడ్మిట్ అయ్యే అవకాశముంది.
చదవండి: అమిత్ షా! ఆధారాలివిగో, మా ఐక్యత దెబ్బతిస్తారా?: పవన్ను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు
అవిశ్వాసం నేపథ్యంలో ప్రధాని మోడీ సభలో మాట్లాడే అవకాశముంది. ఏపీకి ఏమిచ్చామో చెప్పనున్నారని తెలుస్తోంది. హోదా బదులు ఇచ్చిన ప్యాకేజీని చెప్పనున్నారని తెలుస్తోంది. సభలో ప్రసంగించే బీజేపీ ఎంపీలకు ఇప్పటికే సమాచారం అంతా ఇచ్చారని తెలుస్తోంది. టీడీపీ కూడా రెండు బృందాలతో తమ పార్టీ ఎంపీలకు సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
అవిశ్వాసంపై సహకరిస్తామని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ సహకరించింది. మరోవైపు అన్నాడీఎంకే మాత్రం ససేమీరా అంటోంది. తమ డిమాండ్లపై హామీ ఇచ్చేదాకా సభలో ఆందోళనలు నిర్వహిస్తామని చెబుతున్నారు.
ఆందోళన కొనసాగిస్తామని అన్నాడీఎంకే ప్రకటించినప్పటికీ అవిశ్వాసం నోటీసు అడ్మిట్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, ఆరెస్పీ, సీపీఎంలతో కలిపి మొత్తం 80కి పైగా సభ్యులు అవిశ్వాసంపై నోటీసు ఇచ్చారు. దీంతో బీజేపీ కూడా సై అంటోంది.