రాష్ట్రాలు ఒప్పుకుంటే.. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ కిందకు: అరుణ్ జైట్లీ
ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం... వ్యాట్ ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. గుజరాత్
న్యూఢిల్లీ: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు.
బ్యాంకుల 'బూస్ట్', రికార్డ్ స్థాయిల్లో స్టాక్ మార్కెట్లు! దూసుకుపోతున్న సెన్సెక్స్, నిఫ్టీ!
ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం... వ్యాట్ ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్ ను తగ్గించాయి. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ వస్తే... వాటి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కోసమే దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
అయితే పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయాన్ని కోల్పోతాయి. అందుకే, కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.