వరుసగా మూడోరోజూ పెరిగిన పెట్రోల్ ధరలు: ఢిల్లీలో లీటర్కి రూ.73
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి పెట్రోల్ ధరలు భగుమంటున్నాయి. పెట్రోల్పై 45 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ. 73కు చేరుకుంది. వరుసగా మూడో రోజు కూడా పెట్రోల్ ధరలు పెరగడం గమనార్హం. అయితే, డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం ముంబై, కోల్కతా, ఢిల్లీ నగరాల్లో పెట్రోల్ ధర 20 పైసలు పెరిగింది. చెన్నైలో మాత్రం 21పైసలు పెరిగాయి.
ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం.. పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 73.05 ఉండగా, కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.76గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.72గా ఉంది.

ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 75.92గా ఉంది. డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 65.91 ఉండగా, కోల్కతాలో 68.32గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 69.13 కాగా, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69.67గా ఉంది.
హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్కు రూ. 77.59 ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 71.79గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై 21పైసలు పెరిగింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications