ఆ రోజు ఏం జరిగింది?: రాంకుమార్ ఆత్మహత్య ‘స్పాట్ ఫొటోలు’ లీక్, అధికారుల వివరణ
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో నిందితుడు రాంకుమార్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైలు అధికారులు'ఆ రోజు ఏం జరిగిందనే' విషయంపై వివరిస్తున్నట్లు ఓ కథనం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
రాంకుమార్ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయనే ప్రచారాన్ని, అతడిని కారాగార సిబ్బంది కొట్టి చంపారనే ఆరోపణలను కారాగారవర్గాలు ఖండిస్తున్నట్లు, రాంకుమార్ బలవన్మరణానికి పాల్పడిన తీరును వివరిస్తూ ఈ కథనం కొనసాగింది.
'రాంకుమార్ బలవన్మరణానికి పాల్పడిన సాయంత్రం 4.45 గంటలు అనేది ఖైదీలకు ఆహారం అందించే సమయం. అందుకు పలువురు ఖైదీలు ఒకేచోట సమావేశమయ్యారు. అలాంటప్పుడు రాంకుమార్ను ఎలా హత్య చేయగలరు? రాంకుమార్ను కారాగారంలో ఉంచిన ప్రాంతాన్ని 'డిస్పెన్సరి బ్లాక్' అని పిలుస్తారు. ఇది ఉన్నత భద్రత కలిగిన ప్రాంతం. అక్కడ మూడంచెల భద్రత ఉంటుంది' అని వివరించారు.
అంతేగాక, 'రాంకుమార్ మాత్రమే అక్కడ ఒంటరిగా లేడు. అతనితో పాటు 27 మంది ఖైదీలూ ఉన్నారు. రాంకుమార్ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా తినలేదు. అతడిని వ్యక్తిగతంగా పర్యవేక్షించడానికి పేచ్చిముత్తు అనే రెండో గ్రేడ్ పోలీసును నియమించారు. సాయంత్రం భోజనం కోసం రాంకుమార్ వచ్చినప్పుడు అతనితో పాటు పేచ్చిముత్తు కూడా ఉన్నాడు' అని తెలిపారు.
అయితే, 'నీళ్లు తాగొస్తానని చెప్పి వెళ్లిన రాంకుమార్ అకస్మాత్తుగా అక్కడి విద్యుత్తు పెట్టెను చేతితో పగులగొట్టి అందులోని తీగను పళ్ల మధ్యలో బిగించాడు. ఈ అనూహ్య పరిణామం జరిగినప్పుడు రాంకుమార్కు పది అడుగుల దూరంలో పేచ్చిముత్తు ఉన్నాడు. ఆయనతో పాటు మరో నలుగురు ఖైదీలూ ఉన్నారు. రాంకుమార్ చర్యలతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు' అని వివరించారు.
{photo-feature}
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications