20 మందిని కాపాడి హీరో అయిన పిజ్జా బాయ్
ముంబై: ముంబై నగరంలోని చండివాలి ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం భారి నుండి 20 మంది ప్రాణాలు రక్షించిన పిజ్జా డెలివరి బాయ్ ని అందరూ అభినందిస్తున్నారు. అతను తన ప్రాణాలను లెక్క చెయ్యకుండా ఇతరులను కాపాడాడని స్థానికులు అంటున్నారు.
శనివారం సాయంత్రం ముంబైలోని చండివాలి ప్రాంతంలోని అంథేరిలో 21 అంతస్తుల లేక్ హోం రెసిడెన్సియల్ కాంప్లెక్స్ (అపార్ట్ మెంట్)లోని 14వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కాంప్లెక్స్ కు సుమారు 200 మీటర్ల దూరంలోని ఈగల్ బాయ్స్ అనే పిజ్జాలో జితేష్ (21) డెలివరి బాయ్ గా పని చేస్తున్నాడు.
అదే సమయంలో జితేష్ పిజ్జా ఇవ్వడానికి ఆ కాంప్లెక్స్ దగ్గరకు వెళ్లాడు. అప్పటికే మంటలు వ్యాపించి 14వ అంతస్తులోని బాల్కనీ లో నుండి కాపాడాలని గట్టిగా కేకలు వేస్తున్న విషయం గుర్తించాడు. తరువాత అక్కడ ఉన్న సెక్యూరిటిగార్డులు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లను జితేష్ అలర్ట్ చేశాడు.

వారి సహాయంతో 21 అంతస్తు చేరుకున్నాడు. అక్కడి నుండి ఒక్కొక్కరిని కిందకు తీసుకు వచ్చి వదిలి పెట్టాడు. సుమారు 20 మంది ని కిందకు తీసుకు వచ్చాడు. 20 సార్లు కిందకి పైకి వచ్చి వెళుతున్న జితేష్ తన ప్రాణాలను లెక్క చెయ్యలేదు.
ఆ కాంప్లెక్స్ లో ఉన్న వారిని చాల మందిని కాపాడాడు. ఈ అగ్ని ప్రమాదంలో 7 మంది మరణించి 28 మంది గాయపడ్డారు. ఎక్కువ ప్రాణనష్టం జరగకుండ చూసిన జితేష్ ను స్థానికులతో పాటు పోలీసు అధికారులు అభినందించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications