సనాతన ధర్మం నిర్మూలనే ఇండియా కూటమి లక్ష్యం-మోడీ ఫైర్-దేశాన్ని బానిసగా మార్చే యత్నం..
తమిళనాడులో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ ఇవాళ తీవ్రంగా తప్పుబట్టారు. దాన్ని మొత్తం ఇండియా కూటమికి అన్వయిస్తూ మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి భారత్ లో సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది దేశాన్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నమన్నారు.
సనాతన ధర్మాన్ని అంతమొందించాలని, దేశాన్ని వెయ్యేళ్ల క్రితం నాటి బానిసత్వంలోకి నెట్టాలని చూస్తున్నట్లు ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ విపక్షాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై జరిగిన వివాదంపై తొలిసారిగా ప్రధాని బహిరంగంగా స్పందించారు.

ఇటీవల ముంబైలో ఓ సమావేశం నిర్వహించి, అక్కడ 'ఘమాండీ'(అహంకార) కూటమిని ఎలా నడపాలనే విధానం, వ్యూహాన్ని విపక్షాలు నిర్ణయించుకున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. అలాగే వారు ఓ రహస్య ఎజెండాను కూడా నిర్ణయించుకున్నారన్నారు. భారతదేశ సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం అన్నారు. భారతీయుల విశ్వాసంపై దాడి చేయాలని, వేలాది సంవత్సరాలుగా దేశాన్ని ఏకం చేసిన ఆలోచనలు, విలువలు, సంప్రదాయాలను అంతం చేయాలని నిర్ణయించుకున్నాంటూ విపక్షాలపై మోడీ ఆరోపణలు చేశారు.
భారతదేశ వీరులు, సనాతన సంస్కృతికి మధ్య సంబంధాన్ని ప్రధాని మోడీ గుర్తుచేశారు. దేవి అహల్యాబాయి హోల్కర్కు స్ఫూర్తినిచ్చిన సనాతన సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని అహంకార విపక్ష కూటమి సంకల్పించిందని మోడీ విమర్శించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి సనాతనమే బలమన్నారు. బ్రిటిష్ వారిని సవాలు చేసి, ఆమె తన ఝాన్సీని వదులుకోనని చెప్పిందని మోడీ గుర్తుచేశారు.
మహాత్మాగాంధీ సనాతన ధర్మం తన జీవితానికి అవసరమని భావించారని ప్రధాని మోదీ అన్నారు. ఆయన తన జీవితమంతా రాముడి నుండి ప్రేరణ పొందాడన్నారు. ఆయన చివరి మాటలు కూడా 'హే రామ్' అని మోడీ తెలిపారు. స్వామి వివేకానందుడు, లోకమాన్య తిలక్ కూడా సనాతన స్ఫూర్తిని పొందారని తెలిపారు. బ్రిటిష్ వారు ఉరితీసిన స్వాతంత్ర్య సమరయోధులను తిరిగి భరతమాత ఒడిలో పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పడానికి ఈ సంస్కృతే కారణమని ప్రధాని వెల్లడించారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications