నేతాజీ రహస్య ఫైళ్లను విడుదల చేసిన మోడీ, ఉద్వేగం
న్యూడిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన రహస్య ఫైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం విడుదల చేశారు. నేతాజీ జయంతి సందర్భంగా రహస్య ఫైళ్ల డిజిటల్ 100 ప్రతులను ప్రధాని విడుదల చేశారు. కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బోస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం బోస్ కుటుంబ సభ్యులను ప్రధాని పలకరించారు. పైళ్లను విడుదల చేసిన అనంతరం కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. అటు పశ్చిమబెంగాల్ లో బీజేపీ సంబరాలు చేసింది. కోలకతాలో బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కాగా, నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు ఈ పత్రాల్లో వెల్లడైంది.
గత అక్టోబర్లో నేతాజీ కుటుంబసభ్యులను కలిసిన సందర్భంగా నేతాజీ రహస్య ఫైళ్లను విడుదల చేస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే శనివారం ఫైళ్లను విడుదల చేశారు. కాగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసింది.

నేతాజీ విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు తాజాగా వెల్లడైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. బోస్ మిస్టరీ ఛేదించేందుకు ఏర్పాటు చేసిన వెబ్సైట్ బోస్ఫైల్స్.ఇన్ఫో వీటిని బయటపెట్టింది. నేతాజీ 1945, ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో గాయపడిన నేతాజీ అదే రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications