నడి సముద్రంలో నరేంద్ర మోడీ కీలక సమావేశం
కొచ్చి: కేరళ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అరేబియా సముద్ర జలాల్లో వినూత్న రీతిలో త్రివిధ దళాధిపతులతో కీలక సమావేశం నిర్వహించారు. కొచ్చి తీరానికి 40 వాటికన్ మైళ్ల దూరంలో ఈ కీలక సమావేశం జరిగింది.
రెండు రోజులు కేరళ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో కొచ్చి తీరానికి 40 వాటికన్ మైళ్ల దూరంలో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్దనౌక దగ్గరకు వెళ్లారు.
త్రివిధ దళాధిపతులు నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలికారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ కార్యక్రమానికి హాజరైనారు. మద్యాహ్నాం 1 గంట వరకు నరేంద్ర మోడీ, మనోహర్ పారికర్ త్రివిధ దళాధిపతులతో కీలక సమావేశం నిర్వహించారు.

అనంతరం హెలికాప్టర్ లో నరేంద్ర మోడీ కొచ్చి బయలుదేరి వెళ్లారు. భారత నౌకాదళంలోని అతి భారీ యుద్దనౌక విక్రమాదిత్యను నరేంద్ర మోడీ రెండవ సారి సందర్శించారు. గత జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ విక్రమాదిత్యను జాతికి అంకితం చేశారు.
మంగళవారం మద్యాహ్నాం కేరళలోని కొల్లాంలో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాల్గోననున్నారు. అనంతరం సాయంత్రం నరేంద్ర మోడీ ఢిల్లీ బయలుదేరి వెలుతున్నారు. నడి సముద్రంలో నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించి చరిత్ర సృష్టించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications