Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోదీ రోడ్ షో రద్దు, అధికారంలో ప్రత్యర్థి పార్టీ, ఏం జరిగిందంటే ?, ఒకే రోజు మూడు !

భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటకలో పర్యటించనున్నారు. బెంగళూరు నగరంలో శుక్రవారం పలు కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. బెంగళూరు నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో రద్దు కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందారని తెలిసింది. జనవరి 19వ తేదీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

శుక్రవారం ఉదయం మహారాష్ట్ర, మధ్యాహ్నం బెంగళూరు, సాయంత్రం తమిళనాడులో జరిగే వివిధ కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు అవుతారు. ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.35 గంటల వరకు బెంగళూరులో ఉంటారు. నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బెంగళూరు నగరంలో రోడ్‌షో నిర్వహించేందుకు కర్ణాటక బీజేపీ శాఖ నాయకులు సిద్ధం అయ్యారు

PM Narendra Modis road show scheduled to take place in Bengaluru on Friday has been cancelled

ప్రధాని మోదీ రోడ్ షో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కర్ణాటక బీజేపీ నాయకులు ప్రధాని కార్యాలయం నుంచి అనుమతి కూడా కోరారు. అయితే ఇతర కార్యక్రమాల్లో జాప్యం కారణంగా బెంగళూరులో జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు ప్రధాని కార్యాలయం అంగీకరించలేదు. అందుకే నిర్ణీత కార్యక్రమాన్ని ముగించుకుని మోదీ తమిళనాడుకు బయలుదేరుతారని తెలిసింది.

PM Narendra Modis road show scheduled to take place in Bengaluru on Friday has been cancelled

శుక్రవారం ప్రధాని మోదీ కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. నరేంద్ర మోదీ మహారాష్ట్ర నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2. 45 గంటలకు బెంగళూరులోని బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ రెండు కార్యక్రమాల అనంతరం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ తమిళనాడులోని చెన్నైకి చేరుకుంటారు.

చెన్నైలో జరిగే ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ 2023 ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ హాజరు అవుతారు. ఇలా ఒకే రోజులోనే మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా బెంగళూరులో రోడ్ షో రద్దు అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో రద్దు కావడంతో బెంగళూరులోని బీజేపీ నాయకులతో పాటు కర్ణాటకకు చెందిన కమలం పార్టీ నాయకులు నిరాశ చెందారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+