ఫ్రెండ్ కోసం మోదీ ఎంట్రీ.. ఒక్క ఫోన్ కాల్ తో కబ్జా చేసిన ల్యాండ్ వెనక్కి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం, ఆయనతో ఉన్న పాత పరిచయం ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా చిటికెలో పరిష్కరించగలవని నిరూపించే ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదంలో, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్కూల్ ఫ్రెండ్ రంగంలోకి దిగడంతో కథ అడ్డం తిరిగింది. ప్రధానిని కలిసి తన భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు చేసిన కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే, నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే దిగొచ్చి, ఆక్రమించుకున్న భూమిని తిరిగి బాధితుడికి అప్పగించారు.

వడ్ నగర్ స్కూల్ దోస్తీ.. ఆక్రమణకు గురైన భూమి!

గుజరాత్‌లోని వడ్ నగర్ బీఎన్ స్కూల్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోరాకు మహారాష్ట్రలోని మీరా-భయాందర్ ప్రాంతంలో విలువైన స్థలం ఉంది. భయాందర్ ఈస్ట్‌లోని నవఘర్‌లో 1989లో ఆయన సుమారు 2,810 చదరపు మీటర్ల స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అయితే 2011లో కొందరు బిల్డర్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఆయనకు తెలియకుండానే ఆ స్థలాన్ని రెండు భాగాలుగా విభజించి ఆక్రమించుకున్నారని వోరా ఆరోపించారు. ఇందులో ఒక భాగాన్ని బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాతో సంబంధం ఉన్న నిర్మాణ సంస్థ కబ్జా చేసిందని, పురపాలక అధికారులు కూడా వారికే అక్రమంగా నిర్మాణ అనుమతులు ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

PM Narendra Modi s School Friend Gets Disputed Land Back From BJP MLA Days After Seeking Intervention
మోదీ 25ఏళ్ల ప్రజాప్రస్థానం.. ఆశీర్వాద దీపం.. అక్టోబర్ 17వరకు బీజేపీ బిగ్ ప్లాన్!
మోదీ 25ఏళ్ల ప్రజాప్రస్థానం.. ఆశీర్వాద దీపం.. అక్టోబర్ 17వరకు బీజేపీ బిగ్ ప్లాన్!

ప్రధానితో భేటీ.. రంగంలోకి సీఎంవో ఆఫీస్!

స్థానిక మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారుల చుట్టూ ఏళ్లుగా తిరిగినా న్యాయం జరగకపోవడంతో, సెప్టెంబర్ 8న అస్గర్ అలీ వోరా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన భూమి ఆక్రమణపై సీబీఐ విచారణ జరిపించాలని, నకిలీ పత్రాలు సృష్టించిన బిల్డర్లు, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి విన్నవించారు. ప్రధాని మోదీ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీకర్ పరదేశి స్వయంగా రంగంలోకి దిగి, మహారాష్ట్ర సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

పుతిన్‌ను పట్టించుకోకుండా మోదీతోనే..! ఫోటోల కోసం పోటీ పడ్డ డెలిగేట్స్: Viral Video
పుతిన్‌ను పట్టించుకోకుండా మోదీతోనే..! ఫోటోల కోసం పోటీ పడ్డ డెలిగేట్స్: Viral Video

దిగొచ్చిన ఎమ్మెల్యే.. కేసు ఉపసంహరణ!

ప్రధాని ఆఫీస్ నుంచి ఒత్తిడి రావడంతో ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెంటనే వెనక్కి తగ్గక తప్పలేదు. సచివాలయంలో జరిగిన భేటీలో తాను వివాదాస్పద స్థలంపై హక్కులను వదులుకుంటున్నట్లు, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన నిర్మాణ అనుమతులను తిరిగి ఇచ్చేస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ విభాగానికి లేఖ సమర్పించారు. అంతేకాకుండా అస్గర్ అలీపై గతంలో పెట్టిన పోలీస్ ఫిర్యాదును కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రధానితో ఉన్న ఒక్క పరిచయం దశాబ్దాల నాటి ల్యాండ్ గ్రాబింగ్ వివాదానికి క్షణాల్లో ముగింపు పలకడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+