PM Surya Ghar: ఈ పథకంతో మీ ఇంట వెలుగులే కాదు అదనపు ఆదాయం!
భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ద్వారా దేశ ప్రజలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. 300 యూనిట్ల వరకు దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్ ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తీపి కబురు చెప్పారు. సౌర శక్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 15వ తేదీన బియ్యం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇళ్లల్లో సోలార్ ప్యానల్ అమర్చుకోవడానికి 40 శాతం వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది.
స్వయం విద్యుత్ కోసం సోలార్ సిస్టమ్
సౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఒక కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మధ్యతరగతి మరియు పేద కుటుంబాలపై విద్యుత్ భారం పడకుండా ఖర్చును తగ్గిస్తుంది. వారి అవసరాలలో వారిని స్వయం విద్యుత్ ను వినియోగించుకునేలా ఉపయోగపడుతుంది.
రూఫ్ టాప్ సోలార్ సిస్టం భారత ప్రభుత్వం సోలార్ ప్యానల్ లకు సంబంధించి సబ్సిడీ కూడా ఇస్తుంది.

.కోటి ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్
లక్ష రూపాయలతో కూడుకున్న సోలార్ ప్యానల్ కు సంబంధించి 78 వేల రూపాయలవరకు ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. గతంలో ఈ పథకాలు నార్త్ లోనే ఎక్కువగా వినియోగించడం జరిగేది. ఇప్పుడు సౌత్ లో కూడా అన్ని గ్రామాలలో సౌర విద్యుత్ ను వాడుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది..కోటి ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయడం వల్ల దేశం శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్పై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
300 యూనిట్ల ఉచిత విద్యుత్ .. ఆపై విద్యుత్ ఉత్పత్తికి ఆదాయం
ఇది దేశంలోని చాలా ప్రాంతాలలో సంవత్సరంలో 6-8 నెలల పాటు లభించే సూర్యరశ్మిని గరిష్టంగా ఉపయోగించుకుంటుంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన సౌరశక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ పథకం కింద వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తే 18000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 75000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది.
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే
ఈ పథకం కోసం బ్యాంకు నుండి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే కస్టమర్లకు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ పథకం కోసం వినియోగదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు https://www.pmsuryaghar.gov.in/consumerLogin వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి .
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications