పీఎన్బీ స్కాంపై నోరు మెదపరేం: మోడీపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడ్డారు. పరీక్షలకు ఎలా హాజరవ్వాలో గంటలపాటు నరేంద్ర మోడీ విద్యార్థులకు బోధిస్తున్నారని.. అయితే నీరవ్ మోడీ చేసిన మోసాలకు బాధ్యత ఎవరిదో చెప్పడం లేదని ఆరోపించారు.
దేశం నుంచి డబ్బును నీరవ్ మోడీ తీసుకెళ్ళిపోయారన్నారు. నరేంద్ర మోడీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి.. ప్రజల సొమ్మును బ్యాంకుల్లో వేయించారన్నారు. ప్రజల సొమ్మును బ్యాంకుల్లో వేయించి, ఆయన స్నేహితులు, వ్యాపారవేత్తలు బ్యాంకుల నుంచి దోచుకుపోతూ ఉంటే చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
బ్యాంకుల్లో సొమ్ము భద్రంగా ఉంటుందని చెప్పిన నరేంద్ర మోడీ.. రూ.22,000 కోట్ల కుంభకోణం జరిగితే కనీసం ఒక్క మాట అయినా మాట్లాడటం లేదని రాహుల్ మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థనను నరేంద్ర మోడీ సర్వ నాశనం చేశారని విమర్శించారు.