సీఆర్ పీఎఫ్ ఉద్యోగానికి ప్రధాని మోడీ దరఖాస్తు !
న్యూఢిల్లీ: సైబర్ మోసగాళ్ళు ఎంతకైనా తెగిస్తారని మరో సారి వెలుగు చూసింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్ పీఎఫ్) ఉద్యోగానికి ప్రధాని నరేంద్ర మోడీ పేరు, ఫోటో ఉపయోగించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఆర్ పీఎఫ్ నిర్వహించిన రిక్రూట్ మెంట్ టెస్ట్ కోసం ఆన్ లైన్ ద్వారా ఈ దరఖాస్తు పంపించారని పోలీసులు తెలిపారు.
ఆన్ లైన్ దరఖాస్తులో ఓ నిందితుడు తన పేరు నరేంద్ర మోడీ అని రాసి, ఫోటో స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అతికించి పంపించాడు. విషయం తెలుసుకున్న సీఆర్ పీఎఫ్ రిక్రూట్ మెంట్ అధికారులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ పోలీసులు సైబర్ క్రైమ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నరేంద్ర మోడీ పేరుతో దరఖాస్తు పంపించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.