Rajasthan Polls: ముగిసిన రాజస్థాన్ ఎన్నికల పోలింగ్..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. రాజస్థాన్ లో సాయంత్రం 5 గంటల నాటికి రాష్ట్రంలో 68.24 ఓటింగ్ శాతం నమోదైంది. పోలింగ్, మాక్ పోల్ సమయంలో ఈవీఎంలలో చాలా తక్కువ సమస్యలు వచ్చాయని రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. బుండిలోని హిందోలి నియోజకవర్గంలోని అన్ని బూత్లలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. 4-5 బూత్లలో సాయంత్రం 6 గంటల తర్వాత పొడిగించాల్సి వచ్చింది.
ఫతేపూర్ షెఖావతి వద్ద రెండు వర్గల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. "ఒక వీధిలో రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడి జరిగినట్లు మాకు సమాచారం అందింది. మొబైల్ పార్టీ, SHO, CO, పోలీసులు ఇక్కడికి చేరుకుని పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఓటింగ్కు ఎలాంటి ఆటంకం కలగలేదు. 6 నుంచి 7 మందిని అదుపులోకి తీసుకున్నాం " అని ఎస్పీ పారిస్ దేశ్ముఖ్ చెప్పారు.

అత్యధిక పోలింగ్ జైసల్మేర్ జిల్లాలో (76.57%), ధోల్పూర్ (74.11%), ఝల్వార్ (73.37%), ప్రతాప్గఢ్ (73.36%), మరియు బరన్ (73.12%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాలి (60.71%), సిరోహి (63.62%), జలోర్ (64.10%), జోధ్పూర్ (64.32%), ఉదయపూర్ (64.98%)లో అత్యల్ప పోలింగ్ నమోదైంది. అల్వార్లోని తిజారాలో అత్యధికంగా 80.85%, అత్యల్పంగా పాలిలోని సుమెర్పూర్లో 57.81% నమోదైంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications