సాద్వీపై 72 గంటల ప్రచార నిషేధం : బాబ్రీపై వ్యాఖ్యలపై ఈసీ చర్యలు
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేతలో భాగస్వామురాలినని, అందుకు గర్వపడుతున్నారని భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. సాధ్వీ ప్రచారంపై 72 గంటల నిషేధం విధిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
నోటీసులు కూడా ..
ఇటీవల ప్రచారంలో సాద్వీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీచేసింది. అంతేకాదు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనిపై సాద్వీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఈసీ .. ఆమె ప్రచారంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.

హేమంత్ కర్కేపై ..
భోపాల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా సాద్దీ .. తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి దిగ్విజయ్ సింగ్ బరిలో ఉన్నారు. ప్రచారం ప్రారంభించిన్పటి నుంచి సాద్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ముంబై ఉగ్రదాడి సందర్భంగా ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన హేమంత్ కర్కే .. తనతో అనుచితంగా ప్రవర్తించి శాపానికి గురై చనిపోయాడాని వ్యాఖ్యానించింది. దీనిపై ఇంట బయట రచ్చ కావడంతో ఎట్టకేలకు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేతపై నోరుజారి ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications