డిప్యూటీ సీఎం ఓటమి కోసం సర్వశక్తులొడ్డుతున్న ప్రశాంత్ కిషోర్..?
రాజకీయ వ్యూహకర్తగా పేరున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గతంలో ఎన్నో పార్టీల్ని వారి స్వరాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి తనదైన శైలిలో వ్యూహరచన చేశారు. వాటిలో ఎక్కువశాతం సక్సెస్ అయ్యారు కూడా. కానీ ఇప్పుడు ఆయనకు ఓ అసలైన సవాల్ ఎదురవుతోంది. తనను టార్గెట్ చేస్తున్న ఓ డిప్యూటీ సీఎంను ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో పీకే ముందుకు కదులుతున్నారు. తద్వారా ఆయన సత్తాను మరోసారి పరీక్షించుకుంటున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాకూటములకు ప్రత్యామ్నాయంగా మారేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూ, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికీ మధ్య ఎప్పటి నుంచో మాటల యుద్దం సాగుతోంది. సెవెన్త్ క్లాస్ కూడా పాస్ కాని సామ్రాట్ ను డిప్యూటీ సీఎంగా బీజేపీ నామినేట్ చేయడం, ఆయన తనను టార్గెట్ చేస్తుండటంపై ఆగ్రహంగా ఉన్న పీకే ఇప్పుడు ఎన్నికల వేళ వ్యూహం మార్చారు.

ఇప్పటివరకూ సామ్రాట్ చౌదరిపై మాటల యుద్ధం మాత్రమే చేసిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఆయన్ను లాగైనా ఓడించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం తన జన్ సురాజ్ పార్టీ అభ్యర్ధితో పాటు కీలక నేతల్ని సామ్రాట్ పోటీ చేస్తున్న తారాపూర్ కు పంపారు. ముంగేర్ జిల్లాలో ఉన్న ఈ తారాపూర్ నియోజకవర్గంలో సంతోష్ కుమార్ సింగ్ అనే ఓ 48 ఏళ్ల డాక్టర్ ను జన సురాజ్ పార్టీ తరఫున పీకే బరిలోకి దింపారు.

12ఏళ్లుగా డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న సంతోష్ కుమార్ సింగ్ కు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తల్లితండ్రులు ఇద్దరూ పేషెంట్లే. వీరిద్దరికీ ఆయన పర్సనల్ డాక్టర్ గా ఉన్నారు. దీంతో పీకే ఆయన్ను వ్యూహాత్మకంగా బరిలోకి దించారు. స్థానికంగా మంచి డాక్టర్ గా పేరున్న సంతోష్ కుమార్ సింగ్ ను నేరుగా విమర్శించలేక ఆయన ప్రత్యర్ది, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అపసోపాలు పడుతున్నారు. మరోవైపు సంతోష్ కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పీకే వ్యూహం ఫలించవచ్చని భావిస్తున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications