మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. సోమవారం ప్రయాగ్రాజ్కు రాష్ట్రపతి వెళ్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించడంతోపాటు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటన వెలువరించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 10న ఉదయం ప్రయాగ్ రాజ్కు చేరుకుంటారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ప్రార్థనలు చేస్తారు. అనంతరం బడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్ వృక్షాన్ని సందర్శించారు. కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పరిశీలిస్తారని వెల్లడించాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సమయంలో ఆమె వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉంటారని యూపీ సీఎంవో వెల్లడించింది. గతంలో తొలి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కూడా కుంభమేళాకు హాజరయ్యారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పుడు మహా కుంభమేళాను సందర్శిస్తుండటం గమనార్హం.
కాగా, ప్రయాగ్ రాజ్లో మహా కుంభమేళా ప్రారంభమై 28 రోజులు గడస్తున్నా.. కోట్లాది మంది భక్తులు వచ్చిన పుణ్యస్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు. రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ గంటలపాటు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం సాయంత్రం వరకు ఒక కోటి 41 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా వేశారు. కాగా, ఇప్పటి వరకు మహా కుంభమేళాకు వచ్చినవారి సంఖ్య 42 కోట్లకు చేరుకున్నట్లు యూపీ సర్కారు వెల్లడించింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications