వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రానికి తెలంగాణ బిల్లు: జనవరి 23 వరకు గడువు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రపతి తెలంగాణ బిల్లును ఆంధ్రప్రదేశ్‌కు పంపించారు. జనవరి 23వ తేదీ వరకు అసెంబ్లీ అభిప్రాయం చెప్పేందుకు సమయం ఇచ్చారు. తెలంగాణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం గురువారం ఉదయం పంపించింది. బిల్లుపై శాసన సభ అభిప్రాయం ఆరు వారాలు అంటే జనవరి 23లోగా చెప్పాలని గడువు ఇచ్చింది.

President sends T Bill to AP

కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు గురువారం రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయని బుధవారం నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ముసాయిదా బిల్లు ఫైల్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసి కేంద్ర హోం శాఖకు పంపించారు. అనంతరం బిల్లు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శికి వచ్చింది.

అభిప్రాయం చెప్పేందుకు అసెంబ్లీకి ఆరువారాల సమయం ఇస్తారని మొదటి నుండి అందరూ భావించారు. రాష్ట్రానికి బిల్లు వచ్చినందున తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు వెంటనే అసెంబ్లీ ముందుకు తీసుకు రావాలని పట్టుబట్టే అవకాశముంది.

English summary
President Pranab Mukherjee has given the AP state legislature time until January 23 to give its views and suggestions on the draft Andhra Pradesh (Reorganisation) Bill, according to sources in the Union home ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X