రామ్నాథ్ నామినేషన్: చంద్రబాబు సంతకం, కేసీఆర్-అద్వానీ హాజరు
ఎన్డీయే తరఫున రామ్నాథ్ కోవింద్ శుక్రవారం రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రామ్నాథ్ కోవింద్ శుక్రవారం రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు హాజరయ్యారు.
చదవండి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేదే గెలుపు!
తొలి సెట్ పైన ప్రధాని నరేంద్ర మోడీ సంతకం చేశారు. రెండో సెట్పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మూడో సెట్పై బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, నాలుగో సెట్పై బాదల్ సంతకం చేశారు. ప్రతి నామినేషన్ సెట్పై ప్రతిపాదిస్తూ 50 మంది, మద్దతు తెలుపుతూ మరో 50 మంది సంతకాలు చేశారు.
హాజరైన అద్వానీ
నామినేషన్ కార్యక్రమానికి బిజెపి అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులు హాజరయ్యారు. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు వచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తమిళనాడు సీఎం పళనిస్వామి, యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు హాజరయ్యారు. యోగి, చంద్రబాబులు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.