రామ్నాథ్ నామినేషన్: చంద్రబాబు సంతకం, కేసీఆర్-అద్వానీ హాజరు
ఎన్డీయే తరఫున రామ్నాథ్ కోవింద్ శుక్రవారం రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రామ్నాథ్ కోవింద్ శుక్రవారం రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు హాజరయ్యారు.
చదవండి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేదే గెలుపు!
తొలి సెట్ పైన ప్రధాని నరేంద్ర మోడీ సంతకం చేశారు. రెండో సెట్పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మూడో సెట్పై బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, నాలుగో సెట్పై బాదల్ సంతకం చేశారు. ప్రతి నామినేషన్ సెట్పై ప్రతిపాదిస్తూ 50 మంది, మద్దతు తెలుపుతూ మరో 50 మంది సంతకాలు చేశారు.

హాజరైన అద్వానీ
నామినేషన్ కార్యక్రమానికి బిజెపి అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులు హాజరయ్యారు. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు వచ్చారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తమిళనాడు సీఎం పళనిస్వామి, యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు హాజరయ్యారు. యోగి, చంద్రబాబులు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications