పార్లమెంటులో ప్రియాంక తనయుడి సందడి (ఫొటోలు)
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మనవడు, ప్రియాంక గాంధీ తనయుడు రైహాన్ వాద్రా బుధవారంనాడు పార్లమెంటుకు వచ్చారు. కొంత మంది మిత్రులతో కలిసి ఆయన లోకసభ కార్యకలాపాలను వీక్షించారు. లోకసభలోని సందర్శకుల గ్యాలరీలో ఆయన కూర్చున్నారు.
జాకెట్ ధరించి మోహికాన్ హెయిర్ స్టయిల్తో 14 ఏళ్ల సోనియా గాంధీ మనవడు రైహాన్ పార్లమెంటు సెంట్రల్ హాల్ను కూడా సందర్శించారు. కొంత సేపు పార్లమెంటులోని సోనియా గాంధీ కార్యాలయంలో కూర్చున్నారు.

పార్లమెంటును సందర్శించడంపై పిటీఐ వాకబు చేసినప్పుడు నెహ్రూ - గాంధీ వంశం ఐదో తరం రైహాన్ ఇది బాగుందని చెప్పారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో ప్రచారం సాగించినప్పుడు ప్రియాంక గాంధీ తన కుమారుడు రైహాన్ను కూతురు మిరయాను అక్కడికి తీసుకుని వెళ్లి సందర్భాలున్నాయి.













Click it and Unblock the Notifications