తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి (ఫోటోలు)
రాంచీ: అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేసే దేబాశిశ్ బెనర్జీ(65) తన తల్లికి ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చేందుకు పెద్ద ప్రయత్నమే చేశాడు. వివరాల్లోకి వెళితే... 30 ఏళ్ల క్రితం జార్ఖండ్లోని రాంచీకి చెందిన బెనర్జీ చదువు నిమిత్తం అమెరికా వెళుతూ అమెరికా నుంచి రాంచీకి తిరిగి వచ్చేటప్పుడు సొంత ఎయిర్క్రాఫ్ట్లోనే వస్తానని తల్లికి వాగ్ధానం చేశాడు.
చదువు పూర్తైన తర్వాత అమెరికాలో ప్రొఫెసర్గా స్థిరపడిన బెనర్జీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం సొంత ఎయిర్క్రాప్ట్లో ఇన్నాళ్లకు తిరిగి స్వదేశానికి వచ్చాడు. 2005లో ప్లైయింగ్ లైసెన్స్ను పొందిన బెనర్జీ అనంతరం సొంతంగా ప్రయాణించేందుకు నిర్ధిష్ట కాలపరిమితిపై అనుమతికోసం ఎంతగానో శ్రమించాడు.
తల్లికిచ్చిన మాట ప్రకారం ఆమెరికా నుంచి రాంచీకి వచ్చేందుకు ఈ ఏడాది సిద్ధమయ్యాడు. ఇలా పలు అనుమతుల కోసం మూడు సంవత్సరాల శ్రమ, రూ. 35 లక్షల ఖర్చు, సింగిల్ ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్తో 14 దేశాల నుంచి ప్రయాణించి మొత్తంమీద తన కలను సాకరం చేసుకుని చివరకు రాంచీకి చేరుకున్నాడు.

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి
అయితే తన వాగ్ధానాన్ని, కలను సాకారం చేసుకున్నా ప్రొఫెసర్ బెనర్జీ అంసతృప్తితో వెనుతిరుగుతున్నాడు. ఎందుకంటే బెనర్జీ తల్లి ఇప్పడు జీవించిలేదు. విషాదం ఏమిటంటే సొంత ఎయిర్క్రాఫ్ట్తో తిరిగి వస్తానని బెనర్జీ వాగ్ధానం చేసిన కొన్ని రోజులకే ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది.

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి
కాగా తన తల్లికి ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చుకునేందుకు ప్రొఫెసర్కు ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సందర్భంగా రాంచీకి వచ్చిన ప్రొఫెసర్ జాతీయ మీడియాకు ఇంటర్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్యూలో నా వాగ్ధానం, కల ఆమె బాధను కొంతమేరకైనా తగ్గించిందనుకుంటున్నానని చెప్పారు.

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి
ఆ బాధలో ఆమె జీవితం మరికొన్ని రోజులు పెరిగిందనుకుంటున్నానని ఆయన పేర్కొన్నాడు. కాగా, ప్రొఫెసర్ శనివారం కోల్కత్తా మీదుగా అమెరికా తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ ప్రయాణంలో తన తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చడంతో పాటు డయాబెటిస్పై అవగాహన కోసం ప్రచారం చేస్తున్నాడు.

తల్లికిచ్చిన మాట కోసం అమెరికా నుంచి రాంచీకి
ఇందులో భాగంగా తన ఎయిర్క్రాఫ్ట్ రెబెకా తోక భాగంలో రైసింగ్ అవేర్నెస్ ఆఫ్ డయాబెటీస్ అని పెయింట్ చేయించాడు. మొత్తంమీద ప్రొఫెసర్ తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సొంత విమానంలో సొంతంగా నడుపుకుంటూ రాంచీకి తిరిగివచ్చినా అంసతృప్తితోనే వెనుతిరుగడం ఎంతో బాధాకరం.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications