ఇస్రో మాజీ ఛైర్మెన్ యు.ఆర్.రావు కన్నుమూత
ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మెన్ ఉడిపి రామచంద్రారావు (యు.ఆర్. రావు) సోమవారం నాడు చనిపోయాడు. ఆయన వయస్సు 85 ఏళ్ళు.
బెంగుళూరు: ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మెన్ ఉడిపి రామచంద్రారావు (యు.ఆర్. రావు) సోమవారం నాడు చనిపోయాడు. ఆయన వయస్సు 85 ఏళ్ళు.
1932 మార్చి 10న, కర్ణాటకలోని అడమారులో ఆయన జన్మించాడు.ఇస్రో పరిశోధనల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. భారత తొలి వాహన నౌక ఆర్యభట్ట రూపకల్పనలో ఆయనదే కీలకపాత్ర.
పిఎస్ఎల్ఎన్వీ, జీఎస్ఎల్ఎన్వీ, ఇన్శాట్ వాహన నౌకల అభివృద్దిలో ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇస్రో ఛైర్మెన్గా పనిచేసిన యు.ఆర్. రావు 1976లో పద్మభూషణ్, 2017 లో పద్మవిభూషన్ అందుకొన్నారు.

బెంగుళూరు, అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ పాలకమండలి ఛైర్మెన్గా పనిచేశారు. తిరువనంతపురంలోని ఐఐఎన్టీ ఛాన్సిలర్గా కూడ ఆయన పనిచేశారు.
అంతరిక్ష పరిశోధన రంగంలో పనిచేసిన ఆయన సేవలకు గాను రష్యా, నాసా పలు దేశాల నుండి అవార్డులు అందుకొన్నారు.












Click it and Unblock the Notifications