coronavirus:పంజాబ్లో మరో రెండు వారాలు కర్ఫ్యూ, ఉదయం మాత్రం 4 గంటలు సడలింపు
కర్ప్యూ మరో రెండు వారాలు పొడగించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైరస్ కేసులు తగ్గకపోవడంతో డిసిషన్ తీసుకున్నట్టు ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ప్రకటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అయితే ఉదయం పూట ఆంక్షలు సడలిస్తామని.. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేవారు బయటకు వెళ్లొచ్చని స్పష్టంచేశారు.
పంజాబ్లో 313 మందికి కరోనా వైరస్ సోకింది. వైరస్ వల్ల 18 మంది చనిపోయారు. వైరస్ సోకిన వారందరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 4 గంటల పాటు షాపులు తెరిచే ఉంటాయి. అవసరమైన వారు షాపులకు వెళ్లి సరుకులు కొనుగోలు చేయాలని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తించడంతో మార్చి 24వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15వ తేదీ నుంచి రెండోవిడత లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉండగా.. పంజాబ్, తెలంగాణలో కర్ఫ్యూ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంది. పంజాబ్ కూడా కర్ఫ్యూ విధిస్తోంది. దీంతోపాటు బయటకు వచ్చేవారు విధిగా మాస్క్ ధరించాలని, బహిరంగ ప్రదేశంలో ఉమ్మి వేయొద్దని ఆదేశాలను కూడా జారీచేసిన సంగతి తెలిసిందే.
https://twitter.com/ANI/status/1255437302651924481?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1255437302651924481&ref_url=https%3A%2F%2Fliveupdates.hindustantimes.com%2Findia%2Fcoronavirus-latest-india-world-news-covid-19-death-toll-29-april-2020-21588120561130.html











Click it and Unblock the Notifications