మెమన్ను ఉరితీసిన తలారికి రూ.10 వేల చెక్
పుత్తూరు: ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ను ఉరితీసిన తలారికి కర్ణాటకకు చెందిన ఒక విద్యార్ది సంఘం రూ. 10 వేల చెక్ను పంపించారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న యాకుబ్ మెమన్ లాంటి వ్యక్తిని ఉరి తీసిన తలారిని గౌరవించాలని భావించిన విద్యార్థి సంఘం పూత్తూరులోని అంబికా పదవి పూర్వ విద్యాలయ యాజమాన్యానికి తమ ఆలోచనను తెలిపింది.
దీంతో యాజమాన్యం మహారాష్ట్రలోని నాగ్పూర్ జైలు అధికారులను సంప్రదించారు. దానికి వారు అంగీకరించడంతో విద్యార్ధి సంఘం... ప్రతి క్లాసు నుంచి స్వచ్ఛంద విరాళాలను సేకరించారు. అలా సేకరించిన మొత్తాన్ని చెక్కురూపంలో పంపిస్తూ తలారికి అందజేయాల్సిందిగా మహారాష్ట్ర డీజీపీకి పంపారు.
అంతేకాకుండా, ఈ పని చేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని డీజీపీకి లేఖ రాశారు. ఈ రూ. 10వేల చెక్కుని తలారికి అందజేయాలని కోరారు. ఇక (జులై 30) గురువారం మహారాష్ట్రలోని నాగపూర్ జైల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆరోజు ఉదయం 6.43 గంటలకు ఉరిశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే.

ఉరి తీసిన తర్వాత యాకుబ్ మెమెన్ మరణించినట్లుగా వైద్యులు సరిగ్గా ఉదయం 7.01 గంటలకు ప్రకటించారు. అనంతరం యాకుబ్ మెమన్ మృతదేహానికి జైల్లోనే పోస్టుమార్టం నిర్వహించి, నాగాపూర్ నుంచి ముంబైకి విమానంలో అతన్ని మృతదేహాన్ని తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన సంగతి తెలిసిందే.
1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 7 వందల మంది వరకు గాయపడ్డారు.. ఈ కేసులో టైగర్ మెమన్ (యాకూబ్ సోదరుడు), దావూద్ ఇబ్రహీం పేలుళ్లలో ప్రధాన సూత్రధారులు. దీంతో 2007లో ముంబైలోని టాడా కోర్టు మెమన్తో సహా 11 మందికి ఉరిశిక్ష విధించింది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications