సోనియాపై వ్యాఖ్యలు: మోడీ వద్ద గిరిరాజ్ సింగ్ ఏడ్చేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ను ప్రధాని నరేంద్ర మోడీ చీవాట్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ సమయంలో గిరిరాజ్ సింగ్ మోడీ వద్ద ఏడ్చేసినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందులో నిజమేమిటో తెలియదు గానీ ఆ వార్తలను గిరిరాజ్ సింగ్ కొట్టిపారేశారు.
తాను మోడీని కలవనే లేదని, తాను ఏడ్చినట్లు ఎవరు చెప్పారు, ఎవరు చూశారని గిరిరాజ్ సింగ్ మంగళవారం అన్నారు. తెల్ల తోలు మహిళ కాకపోతే కాంగ్రెసు పార్టీ సోనియా గాంధీని కాంగ్రెసు నాయకులు అధ్యక్షురాలిగా అంగీకరించేవారా అని గిరిరాజ్ సింగ్ అప్పట్లో అన్నారు. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది.

గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై సోమవారం పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెసు సభ్యులు గిరిరాజ్ సింగ్పై మండిపడ్డారు. దీంతో ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు.
లోకసభ సోమవారంనాడు సమావేశం కాగానే, కాంగ్రెసు పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆ విషయాన్ని లేవనెత్తారు. బిజెపి పార్లమెంటు సభ్యులు, మంత్రులు వరుసగా అవాంఛనీయమైన, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అటువంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేపుతాయని ఆయన అన్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications