రాఫెల్ ఇష్యూ: డిఫెన్స్ మినిస్ట్రీలోని ఇద్దరు ఫైనాన్స్ ఆఫీసర్స్ షిఫ్ట్
న్యూఢిల్లీ: రాఫెల్ వ్యవహారం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. డిఫెన్స్ మినిస్ట్రీలోని ఫైనాన్స్ విభాగానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను బయటి విభాగానికి షిఫ్ట్ చేశారు. ప్రభుత్వం వారిని డిఫెన్స్ మినిస్ట్రీలోని ఫైనాన్స్ విభాగంలో అపాయింట్ చేసిన నెలలకే ఇప్పుడు ఇది జరిగింది.
ఫైనాన్షియల్ అడ్వయిజర్ (డిఫెన్స్ సర్వీసెస్-ఎఫ్ఏడీఎస్), ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్ను రీప్లేస్ చేస్తున్నారు. ఈ నిర్ణయం ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (ఐడీఏఎస్) కేడర్ను షాకింగ్కు గురి చేసింది.

ఈ ఏడాది ఆగస్టు నెలలో ఎఫ్ఏడీఎస్ బాధ్యతలను మధులికా సుకుల్ తీసుకున్నారు. మధులికను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కు సెక్రటరీగా షిఫ్ట్ చేశారు. ప్రశాంత్ను మరో అధికారిని నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్కు షిఫ్ట్ చేశారు. వీరిద్దరు కూడా ఐడీఏఎస్లో సీనియర్ అధికారులు. పలు మంత్రిత్వ శాఖల్లో వారు పని చేశారు.
ఇప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ ఫైనాన్స్ హెడ్గా గార్గి కౌల్ను నియమించారు. ఇతను 1984 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications