Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

video: భారీ వర్షాలతో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాంగ్రా జిల్లాలోని చక్కి వంతెన.. భారీ వర్షపాతం కారణంగా మూడు స్తంభాలలో ఒకటి పూర్తిగా దెబ్బతినడంతో శనివారం కూలిపోయింది. చక్కి నదిపై నిర్మించిన రైల్వే వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది.

ధర్మశాలలో శనివారం కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలోని మండి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు ప్రవేశించింది. తీవ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

 Railway Bridge Collapses Amid Heavy Rainfall In Kangra, Himachal pradesh

పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో రహదారిపై నిలిపి ఉన్న వాహనాలు ధ్వంసం అయ్యాయి. జిల్లాలోని బాల్, సదర్, తునాగ్, మండి, లమథాచ్‌లలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కాంగ్రా, కులు, మండి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.


హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా, చంబా, బిలాస్‌పూర్, సిర్మౌర్, మండి జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

ప్రతికూల వాతావరణంలో నదులు, వాగుల దగ్గరకు వెళ్లవద్దని స్థానికులు, పర్యాటకులను ప్రభుత్వం హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 25 వరకు భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+