Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ వంట నూనెల ధరల మంట-మార్చి వరకూ ఇదే పరిస్దితి-నిల్వలపై కేంద్రం ఆంక్షలు

దేశవ్యాప్తంగా వంట నూనెల ధరల మంట కొనసాగుతోంది. సన్ ప్లవర్ ఆయిల్ తో పాటు ఇతర నూనెల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే చమురు ధరల మంటతో అల్లాడుతున్న వినియోగదారులకు తాజాగా వంట నూనెల మంట తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. ఈ నేపథ్యంలో వంట నూనెల నిల్వలపై కేంద్రం తాజా ఆంక్షలు విధిస్తోంది.

వంటనూనె ధరల మంట

వంటనూనె ధరల మంట

దేశవ్యాప్తంగా కొన్నిరోజులుగా వంట నూనె ధరల మంట కొనసాగుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ధరలు భారీగా పెరుగుతున్నయి. ఒక్క సన్ ఫ్లవర్ ఆయిల్ చూసుకుంటే లీటరుకు 20 నుంచి 30 రూపాయలు కనీస ధర పెరిగింది. మిగతా నూనెలు కూడా అదే స్ధాయిలో పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో వంట నూనెల ధరలు దాదాపు లీటరు రూ.200 కు చేరుకుంటున్నాయి. దీంతో సామాన్యుడి జేబుకి భారీగా చిల్లు పడుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరోసారి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే చమురు మంటతో సతమతం అవుతున్న జనానికి వంట నూనె ధరల పెరుగుదల తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దీంతో కేంద్రం రంగంలోకి దిగుతోంది.

వంటనూనెల ధరల పెరుగుదల ఇలా..

వంటనూనెల ధరల పెరుగుదల ఇలా..

తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం, ఆలివ్ ఆయిల్ రోజువారీ సగటు రిటైల్ ధర కిలోకు రూ .184.15 కు చేరుకుంది, ముంబై మరియు లక్నోతో సహా కనీసం 22 కేంద్రాల్లో ఈ ధర రూ .200 లేదా అంతకంటే ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. రిటైల్ మరియు హోల్‌సేల్ ధరల డేటాను మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తున్న ఆరు వంట నూనెలలో ఆవ నూనె చాలా ఖరీదైనది. ఇతర తినదగిన నూనెల రిటైల్ ధరలు వేరుశెనగ నూనెకు కిలోకు రూ .182.61, రూ .136.59/kg (వనస్పతి), రూ .155/kg (సోయా), రూ .169.53/kg (పొద్దుతిరుగుడు) మరియు రూ .132.91/kg (తాటి). ఉన్నాయి.

 రంగంలోకి కేంద్రం

రంగంలోకి కేంద్రం

దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు మళ్లీ పెరుగుతుండటం కేంద్రాన్ని కలవరపెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల అధిక ధరలు దేశీయ ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎడిబుల్ ఆయిల్స్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉండేలా ప్రభుత్వం "బహుముఖ వ్యూహాన్ని" రూపొందిస్తున్నట్లు వెల్లడించింది.

నిర్థిష్ట ఆహారపదార్థాల (సవరణ) ఉత్తర్వుపై లైసెన్సింగ్ అవసరాలు, స్టాక్ పరిమితులుస రవాణాపై గతంలో విధించిన ఆంక్షల్ని కేంద్రం సడలిస్తోంది. దీంతో సెప్టెంబర్ 8 నుంచి ఆవ నూనె, నూనె గింజలపై ఫ్యూచర్ ట్రేడింగ్ NCDEX లో నిలిపివేశారు. కేంద్రం తాజా ఉత్తర్వుల ప్రకారం, అందుబాటులో ఉన్న స్టాక్, వినియోగ నమూనా ఆధారంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన ద్వారా అన్ని వంట నూనెలు నూనె గింజల స్టాక్ పరిమితిని నిర్ణయిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే వంట నూనెల ఎగుమతిదారులు, దిగుమతిదారులకు మినహాయింపులు ఇస్తున్నారు.

ఎగుమతిదారు రిఫైనర్, మిల్లర్, ఎక్స్‌ట్రాక్టర్, హోల్‌సేలర్ లేదా రిటైలర్ లేదా డీలర్, విదేశీ ఎగువ ఎగుమతిదారు డైరక్టర్ జనరల్ జారీ చేసిన దిగుమతిదారు-ఎగుమతిదారు కోడ్ నంబర్ కలిగి ఉంటే, అటువంటి ఎగుమతిదారు తన స్టాక్ మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని వంట నూనెగా చూపించగలిగితే నూనెలు, వంట నూనె గింజల ఎగుమతికి అనుమతిస్తామని కేంద్రం చెబుతోంది.

 నిల్వలపై కేంద్రం ఆంక్షలు

నిల్వలపై కేంద్రం ఆంక్షలు

వంట నూనె ధరలు పెరుగుతూనే ఉండడంతో, వచ్చే ఏడాది మార్చి చివరి వరకు తినదగిన నూనెలు మరియు నూనె గింజలపై కేంద్రం స్టాక్ పరిమితిని విధించింది. అంటే మార్చి వరకూ అధిక నిల్వలు పెడితే మాత్రం చర్యలు తప్పవ ని కేంద్రం హెచ్చరించింది. కేంద్రం నిర్ణయంతో దేశీయ మార్కెట్లో వంటనూనెల ధరలు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు భారీ ఉపశమనం కలిగే అవకాశముందని కేంద్రం చెబుతోంది. దిగుమతి సుంకాల హేతుబద్దీకరణ, వంటనూనెల సంస్ధల తరఫున ఉన్న వివిధ వాటాదారులు కలిగి ఉన్న స్టాక్‌ల స్వీయ-బహిర్గతం కోసం వెబ్-పోర్టల్ ప్రారంభించడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+