రాజస్థాన్ ఇష్యూపై ఏమంటారు, అవార్డు వాపసీకి మోదీ సూటి ప్రశ్న
ఘజిపూర్ : ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకొన్న నేపథ్యంలో అధినేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధాని మోదీ తాజాగా విపక్ష కాంగ్రెస్పై ఒంటికాలిపై లేచారు. రాజస్థాన్లో దళిత బాలికపై లైంగికదాడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నించారు.

అరెస్ట్ చేశారా ?
నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. వారిపై యాక్షన్ తీసుకోవడంలో జాప్యానికి కారణమేంటని నిలదీశారు. మోదీ శనివారం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. దీంతోపాటు గతంలో అసహనం అని, అవార్డులను వెనక్కి ఇచ్చిన ప్రముఖులు ఇప్పుడు ఏం చేస్తున్నారని అడిగారు. ఓ దళిత బాలికపై లైంగికదాడి జరిగితే .. మీ అవార్డులను వెనక్కి ఇచ్చేయారా ? మీ వద్దే ఉంచుకుంటారా అని ప్రశ్నించారు.
అందుకే అలా ..
వెనుకబడిన వర్గానికి చెందిన తాను ప్రధానిగా ఉంటే జీర్ణించుకోలేని ప్రముఖులు అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. మరి ఇప్పుడు ఏమైంది ? అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని సూచించారు. ఆ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇవ్వాలని కోరారు.
మానవత్వం
మరో శోన్ భద్ర సభలో ప్రసంగిస్తూ .. తనది ఏ కులం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వారికి వేదికపై నుంచి ఒక్కటే చెబుతున్నా ... దేశంలో పేదలందరిదీ ఒక్కటే కులం అని ప్రజల కరతాళధ్వనల మధ్య ప్రకటించారు. దేశంలో ఉన్న ఆ పేదల కులమో ఏదో .. తనది అదే కులమని పేర్కొన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications