అమాయకుడ్ని: ఇన్ఫోసిస్ హత్య టెక్కీపై రామ్ కుమార్ యూటర్న్
చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేస్తాడన్న ఆరోపణలను అతని లాయర్ మంగళవారం నాడు చెప్పాడు. అదే సమయంలో రామ్ కుమార్ కూడా హత్యారోపణలను కొట్టి పారేయడం గమనార్హం. ఈ మేరకు ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.
ఇన్ఫోసిస్ స్వాతి హత్య కేసు: తెరపైకి సూర్య ప్రకాశ్, ఎవరతను?
రామ్ కుమార్ మంగళవారం నాడు చెన్నై కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఆత్మహత్యాయత్నం చేసిన రామ్ కుమార్ మరోసారి అలా చేసే అవకాశముందని, కాబట్టి పోలీసులు చాలా కేర్ఫుల్గా ఉండాలని ఓ లాయర్ డిమాండ్ చేశారు.
టెక్కీ హత్యలో ట్విస్ట్: నిందితుడితో స్వాతికి ఫ్రెండ్షిప్! పక్కా ప్లాన్..
కాగా, సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య చిక్కుముడులు ఇంకా వీడినట్లు కనిపించడం లేదు. హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. స్వాతిని అతికిరాతకంగా చంపింది మొదట రామ్ కుమార్ ఒక్కడే అనుకున్నా ఇప్పుడిప్పుడు మరొకొన్ని నిజాలు బయటకొస్తున్న విషయం తెలిసిందే. స్వాతి హత్య విషయంలో రామ్ కుమార్కు మరో ఇద్దరు సహకరించారని అనుమానిస్తూ వార్తలు వచ్చాయి. నటేశన్, సూర్యప్రకాష్ పేర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి.