ధాష్టీకం: మూడేళ్ళ చిన్నారి ఏడుస్తున్నాడని కాలు విరిచి, నోరుమూసి...మరో ఆసుపత్రికిలా..
తనకు నిద్ర భంగం చేసిన ఓ మూడురోజుల చిన్నారిని కాలువిరిచి నోరుమూసివేసి ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తి దాష్టీకానికి పాల్పడ్డాడు.ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
డెహ్రడూన్ :మూడు రోజుల చిన్నారి ఏడుస్తుండడంతో తనకు నిద్రభంగమైందని భావించి ఆ చిన్నారి కాలువిరిచాడు ఓ దుర్మార్గుడు.పైగా ఏమి తెలియనట్టుగానే పిల్లాడు ఏడుస్తున్నాడని డాక్టర్ ను పిలిచాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకొంది.
ఉత్తరాఖండ్ లోని రూర్కీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకొంది.వాణిక్ ప్రాంతానికి చెందిన దంపతులకు జన్మించిన దంపతులకు శిశువు పుట్టింది.అయితే ఆ శిశువును ఐసియూలో పెట్టాలని పెట్టాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఐసియూలో పెట్టారు.
మూడు రోజులైనా చిన్నారి కోలుకోలేదు.అయితే మూడో రోజు నైట్ డ్యూటీకి వచ్చిన ఆసుపత్రి సిబ్బంది చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించాడు.
అర్థరాత్రిపూట పసివాడు ఏడుపు మొదలుపెట్టాడు. అయితే పసిపాపను నిద్రపుచ్చి తాను కూడ పడుకొన్నాడు. మరోసారి శిశువు ఏడుపు మొదలుపెట్టాడు.
శిశువు ఏడుపుతో తనకు నిద్రభంగమైందని భావించిన ఆ వ్యక్తి చిన్నారి కాలు విరిచాడు.నోరు గట్టిగామూసివేశాడు.తర్వాత ఏమితెలియనట్టుగా డాక్టర్ ను పిలిచి చిన్నారి ఏడుస్తున్నాడని చెప్పాడు.
వైద్యుడు ఆ చిన్నారిని పరీక్షించి మరో ఆసుపత్రికి తరలించాలని సూచించాడు.అయితే వేరే ఆసుపత్రికి తీసుకెళ్ళినా పరిస్థితిలో మార్పు రాలేదు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.
అసలేం జరిగిందో తెలుసుకోవాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తే ఆసుపత్రి యాజమాన్యం దౌర్జన్యం చేశారు.పోలీసుల సహయంతో సిసిటీవిని పరిశీలించగా చిన్నారిపై దాష్టీకం వెలుగుచూసింది. సిసిటీవి పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.