వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఆర్థిక ఉద్దీపన కోసం రూ.1.5 నుంచి రూ.2.3 ట్రిలియన్లు..?,

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నేపథ్యంలో భారీగా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థికశాఖ, ఆర్బీఐ ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు చర్చలు జరుపుతున్నారు. 1.5 ట్రిలియన్లు వెచ్చించేందుకు కేంద్రం సంసిద్దత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఉద్దీపన ప్రణాళిక రూ.2.3 ట్రిలియన్ల వరకు ఉండొచ్చని సీనియర్ అదికారి ఒకరు తెలిపారు.

లాక్‌డౌన్ వల్ల అన్ని రంగాలు కుదేలైపోనున్నాయి. చిన్న వ్యాపారులకు ఊతం ఇచ్చేందుకు, పేదలకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి దాదాపు 100 మిలియన్ల పేదల ఖాతాలో నగదు జమచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం దక్షిణాసియాలో ఎక్కువగా ఉంది. భారత్‌లో 606 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. 3 వారాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Rs 2.3 trillion for 1.3 billion: Govt to announce stimulus package to fight coronavirus

వైరస్ ప్రభావం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతోందని నిపుణులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సెక్యూరిటీలను కొనుగోలు చేయాలని సెంట్రల్ బ్యాంకును కోరినట్టు తెలుస్తోంది. దేశంలోనే కాక ఇతర దేశాలకు చెందిన బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేయాల్సి ఉంటుందనే వాదన వినిపిస్తోంది.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

ద్రవ్యోల్బణంపై బాండ్లు విక్రయంపై స్పందించేందుకు ఆర్థికశాఖ నిరాకరించింది. ఆర్బీఐ కూడా స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్యాకేజీ ప్రకటిస్తోందని మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆదాయపు పన్ను కట్టేవారి గడువును పొడిగించారు. మరోవైపు సేవింగ్స్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా, ఏ ఏటీఎం కార్డు నుంచి నగదు తీసుకొవచ్చని.. చార్జీ వసూల్ చేయబోమని స్పష్టంచేశారు.

English summary
Centre government is likely to agree to an economic stimulus package of more than Rs 1.5 trillion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X