గుజరాత్ తీరంలో రూ.350 కోట్ల డ్రగ్స్ సీజ్- పాకిస్తాన్ బోటు నుంచి కోస్ట్ గార్డ్ స్వాధీనం
గుజరాత్ తీరంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. గతంలో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికిన ఘటన మర్చిపోక ముందే మరోమారు ఇదే తరహాలో కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ లభ్యమైంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ బోటులో రూ.350 కోట్ల విలువైన 50 కేజీల హెరాయిన్ ను గుజరాత్ ఏటీఎస్, కోస్ట్ గార్డ్ జాయింట్ ఆపరేషన్ తో పట్టుకున్నాయి.
గుజరాత్ తీవ్రవాద నిరోధక దళం, భారతీయ కోస్ట్ గార్డ్ అరేబియా సముద్ర తీరంలో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇందులో ఓ పాకిస్తాన్ పడవ దొరికింది. ఇందులో అంతర్జాతీయ మార్కెట్ విలువ ప్రకారం ₹ 350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బోటులో ఉన్న ఆరుగురు సిబ్బందిని కూడా పట్టుకున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో గుజరాత్ తీరంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏటీఎస్ బృందాలు ఆరుగురు సిబ్బందితో ఉన్న పాకిస్తాన్ బోట్ అల్ సకర్ను అడ్డగించాయి. గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలో ఇందులో 50 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సముద్రం మధ్యలో మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించిన సంకేతాలు రావడంతో పక్కా ప్రణాళికతో వీటిని ఏటీఎస్, కోస్ట్ గార్డ్ పట్టుకున్నాయి. ఈ బోటులో దొరికిన ఆరుగురిని ప్రస్తుతం విచారిస్తున్నారు. విచారణలో లభించే ఆధారాలతో పాకిస్తాన్ లింకులపై ఆరా తీయొచ్చని భావిస్తున్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications