ప్రత్యేక విందులో రష్యా అధ్యక్షుడు పుతిన్కు వడ్డించినవి ఇవే..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది. పుతిన్ ఇప్పటికే 10 సార్లు ఇండియాను సందర్శించగా.. ఇది ఆయన 11వ పర్యటన. ఈ క్రమంలోనే ఈ రెండు రోజుల పర్యటనలో పుతిన్ కు స్వాగతం నుంచి వీడ్కోలు వరకు ఘనంగానే నిర్వహించారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ మోడీ స్వాగతం పలకడం.. ఒకే కారులో ప్రయాణించడం సహా మరెన్నో ఆసక్తికర ఘటనలు ఈ పర్యటనలో చోటు చేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుండి రష్యాకు పుతిన్ బయలుదేరారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయనకు వీడ్కోలు పలికారు.
అంతే కాకుండా పుతిన్ తన ఆరోగ్యం, ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. దీంతో ఈ పర్యటనలో ఆ విషయం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా వ్లాదిమర్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో శుక్రవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందు మెనూ ప్రస్తుతం వైరల్ గా మారగా.. రష్యా అధ్యక్షుడికి ఏవేమ వడ్డించారని ఆసక్తి నెలకొంది.

మెనూ ఇదే..
పుతిన్కు వడ్డించిన విందు పూర్తిగా శాకాహార వంటకాలతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో దేశంలోని నలుమూలల నుంచి ఎంపిక చేసిన వంటకాలకు స్థానం కల్పించారు. మురుంగెలై చారు, గుచ్చి డూన్ చెటిన్, పుదీనా సాస్ , షీర్మల్తో కాలే చనే కే శికంపురి కబాబ్లు, ప్రసిద్ద 'జోల్ మోమో' (కూరగాయలతో నింపిన డంప్లింగ్స్)తో స్టార్టర్స్ ప్రారంభమయ్యాయి.
ప్రధాన వంటకాల్లో 'జఫ్రానీ పనీర్ రోల్', 'పాలక్ కోఫ్తా', 'గుజరాతీ దాల్', మట్టర్ కా సాగ్, తందూరీ భర్వాన్ ఆలూ, ఆచారి బైంగన్, ఎల్లో దాల్ తడ్కా, డ్రై-ఫ్రూట్ కుంకుమపువ్వు పులావ్, లచ్చా పరాఠా, మిస్సి రోటీ, మగజ్ నాన్ వంటి వివిధ రకాల రోటీలను వడ్డించారు. ఇక డెజర్ట్స్ విభాగంలో సంప్రదాయ 'బాదం కా హల్వా'తో పాటు 'సీతాఫల్ క్రీమ్'ను కూడా అందించారు. దానిమ్మ, నారింజ, క్యారెట్-అల్లం, బీట్రూట్ జ్యూసులు.. గోంగూర ఊరగాయ, మామిడి చట్నీ.. ఇలా ఈ వంటకాలన్నీ పుతిన్కు బాగా నచ్చాయని అంటున్నారు.

ఇక ఈ విందుతో పాటు సంగీత కచేరీ కూడా మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రపతి భవన్ బ్యాండ్ కళాకారులు 'వందేమాతరం', 'సారే జహా సే అచ్ఛా' వంటి భారతీయ గీతాలతో పాటు, 'కత్యుషా', 'మాస్కో నైట్స్' వంటి ప్రసిద్ధ రష్యన్ గీతాలను కూడా ఆలపించి అతిథులను అలరించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ భారత్ చూపిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విందు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరోవైపు ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బహూకరించిన ఆరు బహుమతులు కూడా హాట్ టాపిక్ గా మారాయి.

మార్బుల్ చెస్ సెట్
టీ, కేసర్
కశ్మీరీ కుంకుమపువ్వు (కేసర్).
శ్రీమద్ భగవద్గీత
సిల్వర్ టీ-సెట్
వెండి గుర్రం
ఈ బహుమతులన్నీ భారత కళలు, సంస్కృతి, భౌగోళిక వైవిధ్యాన్ని - తూర్పున బెంగాల్, పశ్చిమాన మహారాష్ట్ర, ఉత్తరాన కశ్మీర్ వరకు దేశ గొప్పతనాన్ని రష్యా అధ్యక్షుడికి అద్భుతంగా పరిచయం చేశాయి.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications