పాక్ తో సీజ్ ఫైర్ లో అమెరికా పాత్ర ఎంత ? వార్ రూమ్ చర్చలు బయటపెట్టిన జైశంకర్..!
కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు ఈ ఆపరేషన్ జోరుగా కొనసాగింది. అయితే ఉన్నట్లుండి ఐదో రోజు భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో మరో వివాదం మొదలైంది. భారత్-పాక్ కాల్పుల విరమణకూ, అమెరికాకూ సంబంధం లేదంటూ మనం చెప్తుంటే, ట్రంప్ మాత్రం తానే వాణిజ్యాన్ని అడ్డుపెట్టి యుద్ధం ఆపానని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఇవాళ మరో కీలక సాక్ష్యం బయటపెట్టింది.
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న క్రమంలో అనూహ్యంగా సీజ్ ఫైర్ ఒప్పందం జరగడానికి ముందు వార్ రూమ్ లో చోటు చేసుకున్న పరిణామాల్ని విదేశాంగమంత్రి జైశంకర్ ఇవాళ బయటపెట్టారు. పాకిస్తాన్ పై భారత్ దాడులు చేస్తున్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత ప్రధాని మోడీకి ఫోన్ చేశారని ఆయన తెలిపారు. ఆ సమయంలో తాను కూడా అదే రూమ్ లో ఉన్నట్లు జైశంకర్ తెలిపారు.

మీరు యుద్ధం ఆపకపోతే పాకిస్తాన్ మీపై తీవ్రంగా దాడులు చేయబోతోందని జేడీ వాన్ భారత ప్రధాని మోడీకి తెలిపినట్లు జైశంకర్ వెల్లడించారు. దీనికి కౌంటర్ గా తాము కూడా ప్రతీకార దాడులు చేస్తామని ప్రధాని మోడీ వాన్స్ కు చెప్పేశారన్నారు. మే9న పాకిస్తాన్ తమపై భారీగా దాడులు చేసిందని, అయితే తాము కూడా అంతే దీటుగా వాటిని తిప్పికొట్టామని జైశంకర్ వెల్లడించారు.
ఆ తర్వాతి రోజు మళ్లీ అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి మార్కూ రూబియో ఫోన్ చేసి పాకిస్తానీయులు మీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారన్నారు.

ఆ మధ్యాహ్నం తరువాత, పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ కాశిఫ్ అబ్దుల్లా నేరుగా భారత లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్కు ఫోన్ చేసి కాల్పుల విరమణ కోరారన్నారు. దీంతో కాల్పుల విరమణకు తాము కూడా అంగీకరించినట్లు జైశంకర్ వెల్లడించారు. ఇందులో ట్రంప్ చెబుతున్నట్లు జోక్యం కానీ, వాణిజ్యాన్ని అడ్డుపెట్టి హెచ్చరికలు చేసిందీ లేదన్నారు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications