Sabarimala: శబరిమలలో వేలం పాట, TDB నిర్ణయంతో రూ. 35 కోట్లు నష్టం, వ్యాపారులకు మరో చాన్స్, దేవస్వం !
శబరిమల/ కొచ్చి/ ఎరిమేళి: భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు సంఖ్య చాలా తగ్గిపోయింది. ప్రతిఏడాది అయ్యప్పస్వామి భక్తుల సీజన్ లో వ్యాపారాలు చెయ్యడానికి పోటీ పడే వ్యాపారులు ఇప్పుడు దుకాణాలు (షాపులు) పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. షాపు రూమ్ లు వేలంలో పాడుకోవడానికి వ్యాపారులు ఆసక్తి చూపించకపోవడంతో ట్రావంకోర్ దేవస్వం బోర్డు (TDB)కి దాదాపు రూ. 35 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఈ పరిస్థితుల్లో శబరిమలకు అయ్యప్ప భక్తులు వెళ్లే మార్గంలోని షాపు రూమ్ లు మళ్లీ వేలం వెయ్యాలని దేవస్వం బోర్డు నిర్ణయం తీసుకుంది. షాపు రూమ్ లు వేలంలో పాడుకున్న వ్యాపారులు, అక్కడ పని చేసే వాళ్లకు కచ్చితంగా కోవిడ్ పరీక్షలు చెయ్యాలని అధికారులు డిసైడ్ అయ్యారు.

పంపా టూ సన్నిధానం
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు పుణ్యనది పంపాలో స్నానం చేసి ఇరుముడి తల మీద పెట్టుకుని నడక మార్గంలో శబరిమలలోని అయ్యప్ప సన్నిధానం వరకు పాదయాత్ర చేసి వెలుతుంటారు. పంపా నుంచి శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానం వరకు వందల సంఖ్యలో షాపు రూమ్ లు, తాత్కాలిక షెడ్ లు ఉన్నాయి. ఈ షాపు రూమ్ ల్లో అయ్యప్పస్వామి భక్తులకు అవసరమయ్యే ఆహార పదార్థాలతో పాటు నిత్యవసర వస్తులు అందుబాటులో ఉంటాయి.

నిన్న రూ. 45 కోట్లు ఆధాయం
కరోనా వైరస్ మహమ్మారి (COVID-19) దెబ్బతో శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య ఊహించని విధంగా తగ్గిపోయింది. ఈ సందర్బంలో పంపా నుంచి శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం వరకు ఉండే షాపు రూమ్ లు వేలం పాటలో పాడుకోవడానికి వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. గత ఏడాది షాపు రూమ్ లు వేలం వెయ్యడంతో దేవస్వం బోర్డుకు రూ. 45 కోట్ట ఆధాయం వచ్చింది.

TDB కి రూ. 35 కోట్లు నష్టం
ఈ ఏడాది షాపు రూమ్ లో వేలం పాటలో పాడుకోవడానికి వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, కోవిడ్ కారణంగా దేవస్వం బోర్డు వేలం పాట నిర్వహించకపోవడంతో దేవస్వం బోర్డుకు ఇప్పటి వరకు రూ. 35 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఈ సందర్బంగా పంపా నుంచి శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం వరకు ఉండే 252 షాపు రూమ్ లు వేలం వెయ్యాలని, వ్యాపారులను వేలం పాటకు ఆహ్వానించాలని దేవస్వం బోర్డు అధికారులు నిర్ణయించారు.

మళ్లీ కొత్త షాపులు ప్రారంభం
నీళక్కల్, పంపా, శబరిమలలోని సన్నిధానంలో కేవలం కొన్ని షాపు రూమ్ లు మాత్రమే ఇప్పటి వరకు దేవస్వం బోర్డు అధికారులు వేలం పాట నిర్వహించారు. కొన్ని షాపు రూమ్ లో వేలం పాటలో వ్యాపారుల పాడుకోవడంతో దేవస్వం బోర్డు కు ఇప్పటి వరకు కేవలం మూడు కోట్ల రూపాయలు ఆధాయం వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన 118 షాపు రూమ్ లు, తాత్కాలిక షెడ్ లు మళ్లీ వేలం పాట నిర్వహించాలని దేవస్వం బోర్డు అధికారులు నిర్ణయించారు. వేలం పాటలో షాప్ రూమ్ లు తీసుకున్న వ్యాపారులు జనవరి చివరి వరకు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Recommended Video

14 రోజులు ఉంటే కరోనా పరీక్షలు
నీళక్కల్, పంపా, శబరిమల, సన్నిధానంలో వేలం పాటలో షాపు రూమ్ లు, తాత్కాలిక షెడ్ లు వేలం పాటలో పాడుకుని వ్యాపారాలు చేసే వ్యాపారులు, అక్కడి సిబ్బంది 14 రోజులు అక్కడ ఉండాలంటే ప్రతి ఒక్కరికి కచ్చితంగా కరోనా వైరస్ (COVID-19) పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వైద్యశాఖ అధికారులు నిర్వహించే పరీక్షలకు వ్యాపారులు, సిబ్బంది సహకరించాలని, అందుకు అంగీకారం తెలిపితేనే వ్యాపారులు వేలం పాటలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications