సల్మాన్ సినిమాలు ఇప్పటికీ చూస్తా: శిక్ష కంటే పరిహారం ముఖ్యమన్న బాధితుడు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు 2002 హిట్ అండ్ రన్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే ఈ కేసులో కారు ఢీకొన్న ప్రమాదంలో బాధితులు మాత్రం అతడికి శిక్ష పడటం కంటే.. తమకు పరిహారం అందడమే ముఖ్యమని అంటున్నారు.
అబ్దుల్లా రవూఫ్ షేక్ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో కాలు కోల్పోయారు. ఆయన మాట్లాడుతూ.. గత 13ఏళ్లుగా తన వద్దకు ఎవ్వరూ రాలేదని, ఏదో పనిచేసుకుంటూ బతుకుతున్నానని, చాలా సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు.
సల్మాన్ పట్ల తమకు కఠినమైన భావనలేమీ లేవని.. అతడి సినిమాలు ఇప్పటికీ చూస్తానని తెలిపారు. ఆయనకు శిక్షపడడం కంటే తమకు పరిహారమే ముఖ్యమని షేక్ పేర్కొన్నారు.

'సల్మాన్కు శిక్ష పడడం వల్ల నాకు ఎలాంటి లాభం లేదు. నా కాలు తిరిగి రాదు.. నా సమస్యలేమీ తగ్గవు' అని అబ్దుల్లా షేక్ వెల్లడించారు. ప్రమాదానికి గురైనప్పుడు తన వయస్సు 22ఏళ్లని గుర్తు చేసుకున్నాడు.
కాగా, ప్రమాదంలో మృతిచెందిన నౌరుల్లా మెహబూబ్ షరీఫ్ భార్య మాట్లాడుతూ.. నష్ట పరిహారంగా డబ్బు కంటే తన కుమారుడికి ఉద్యోగం ఇస్తే తమకు ఆసరాగా ఉంటుందని తెలిపారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications