ములాయం సింగ్ యాదవ్ కు సతీ వియోగం-భార్య సాధనా గుప్తా కన్నుమూత
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య సాధనా గుప్తా ఇవాళ చనిపోయారు. అనారోగ్యం కారణంగా మేదాంత ఆస్పత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. దీంతో సమాజ్ వాదీ పార్టీలో విషాదం నెలకొంది.
ములాయం రాజకీయాల్లో చురుగ్గా ఉండే రోజుల్లో ఆయనతో ప్రయాణం మొదలుపెట్టిన సాధనా గుప్తా చాలా రోజుల పాటు రహస్యంగానే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య అయిన సాధనా గుప్తా 2003 తర్వాతే అందరికీ పరిచయమయ్యారు. అఖిలేష్ యాదవ్ తల్లి మాలతీ యాదవ్ చనిపోయిన తర్వాత ఆమె బయటికి కనిపించారు. మాలతి మృతి తర్వాత సాధనా గుప్తాను ములాయం బహిర్గతం చేశారు. ఆ తర్వాత నుంచి అందరికీ కనిపించిన సాధనా గుప్తా పార్టీ వ్యవహారాల్లో మాత్రం దూరంగా ఉండేవారు. ఇప్పుడు ఆమె మృతితో ములాయం కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నట్లయింది.

సాధనా గుప్తా మృతిపై యోగీ సర్కార్ లో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంతాపం ప్రకటించారు. మాజీ సీఎం ములాయం భార్య మృతిపై స్పందించిన మౌర్య.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా చనిపోయారన్న విషాద వార్త అందింది. ఆమెకు దేవుడు స్వర్గం ప్రసాదించాలని, అలాగే ములాయం కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని మౌర్య తన ట్వీట్ లో పేర్కొన్నారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications