పగ్గాలు అప్పగించిన వేళ.. శశికళ కంటతడి.. పోయెస్ గార్డెన్లో ఉద్వేగం
పార్టీ పగ్గాలు స్వీకరించాలన్న అన్నాడీఎంకె నేతల అభ్యర్థనతో తొలుత శశికళ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
చెన్నై: పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా అన్నాడీఎంకె ముఖ్య నేతలంతా పోయెస్ గార్డెన్ లోని చిన్నమ్మ శశికళ వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. పార్టీ పగ్గాలు స్వీకరించాలన్న అన్నాడీఎంకె నేతల అభ్యర్థనతో తొలుత శశికళ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో పోయెస్ గార్డెన్ లో వాతావరణం ఉద్వేగభరితంగా మారింది.
ఈ సందర్బంగా పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని సీఎం పన్నీర్ సెల్వం శశికళకు అందజేశారు. దీంతో ఉద్వేగానికి లోనైన శశికళ కంటతడి పెట్టుకున్నారు. అంతకుముందు పూలమాలతో అలకరించి ఉన్న జయలలిత చిత్రపటానికి చేతులు జోడించి నివాళులు అర్పించారు. కాగా, చిన్నమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

చిన్నమ్మ నాయకత్వాన్ని సమర్థిస్తూ పార్టీ నేతలంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ అధినేత్రిగా అన్నాడీఎంకెను ముందుండి నడిపించాల్సిందిగా కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమెకు అందజేశారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతూ పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం తీర్మాన పత్రాలను తీసుకుని శశికళ ఆమె నివాసంలోకి వెళ్లిపోయారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications